'ఓఖీ'లో చిక్కుకున్న లక్ష్యద్వీప్‌

- December 02, 2017 , by Maagulf
'ఓఖీ'లో చిక్కుకున్న లక్ష్యద్వీప్‌

కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌ను 'ఓఖీ' తుపాను వణికిస్తోంది. తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల లక్షద్వీప్‌ దీవుల్లో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. బలమైన ఈదురు గాలులతో వందల సంఖ్యలో కొబ్బరి చెట్లు నేలకూలాయి. సమాచార వ్యవస్థ దెబ్బతింది. మినికోయి దీవిలో శనివారం ఉదయం వరకు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కల్పెనీ, మినికోయి ప్రాంతాల్లో అనేక ఇళ్లు కుప్పకూలాయి. గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికే పెను తుపానుగా మారిన ఓఖీ వల్ల వచ్చే 24 గంటల్లోనూ లక్షద్వీప్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అటు కన్యాకుమారిలోనూ ఓఖి తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. శనివారం ఉదయం వరకూ అక్కడి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. ఎటు చూసినా మోకాలి లోతు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉండిపోయాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com