'ఓఖీ'లో చిక్కుకున్న లక్ష్యద్వీప్
- December 02, 2017
కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ను 'ఓఖీ' తుపాను వణికిస్తోంది. తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల లక్షద్వీప్ దీవుల్లో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. బలమైన ఈదురు గాలులతో వందల సంఖ్యలో కొబ్బరి చెట్లు నేలకూలాయి. సమాచార వ్యవస్థ దెబ్బతింది. మినికోయి దీవిలో శనివారం ఉదయం వరకు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కల్పెనీ, మినికోయి ప్రాంతాల్లో అనేక ఇళ్లు కుప్పకూలాయి. గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే పెను తుపానుగా మారిన ఓఖీ వల్ల వచ్చే 24 గంటల్లోనూ లక్షద్వీప్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అటు కన్యాకుమారిలోనూ ఓఖి తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. శనివారం ఉదయం వరకూ అక్కడి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. ఎటు చూసినా మోకాలి లోతు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉండిపోయాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







