విరాట్ ను కలవడం చాలా సంతోషం: రమ్యకృష్ణ
- December 02, 2017

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా విజయ ఢంకా మోగించిన తెలుగు చిత్రం 'బాహుబలి 2'. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం ఇటీవల ఓ ఛానెల్ నుంచి 'అత్యుత్తమ విజయం' అవార్డు అందుకుంది. ఈ వేడుకకు చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ, 'శివగామి' రమ్యకృష్ణ హాజరయ్యారు. కాగా, ఇదే కార్యక్రమంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేదికపై విరాట్తో కలిసి దిగిన ఫొటోను రమ్యకృష్ణ ట్విటర్లో పోస్ట్ చేశారు. విరాట్ చాలా మంచి వ్యక్తని, ఆయన్ను కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్గా మారింది. సోషల్మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
రమ్యకృష్ణ 'హలో', 'గ్యాంగ్' చిత్రాల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ రెండు సినిమాల చిత్రీకరణ చివరి దశలో ఉంది. అఖిల్ హీరోగా నటిస్తున్న 'హలో' చిత్రం డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య నటిస్తున్న 'గ్యాంగ్' వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







