విరాట్ ను కలవడం చాలా సంతోషం: రమ్యకృష్ణ

- December 02, 2017 , by Maagulf

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా విజయ ఢంకా మోగించిన తెలుగు చిత్రం 'బాహుబలి 2'. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం ఇటీవల ఓ ఛానెల్‌ నుంచి 'అత్యుత్తమ విజయం' అవార్డు అందుకుంది. ఈ వేడుకకు చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ, 'శివగామి' రమ్యకృష్ణ హాజరయ్యారు. కాగా, ఇదే కార్యక్రమంలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా వేదికపై విరాట్‌తో కలిసి దిగిన ఫొటోను రమ్యకృష్ణ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. విరాట్‌ చాలా మంచి వ్యక్తని, ఆయన్ను కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
రమ్యకృష్ణ 'హలో', 'గ్యాంగ్‌' చిత్రాల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ రెండు సినిమాల చిత్రీకరణ చివరి దశలో ఉంది. అఖిల్‌ హీరోగా నటిస్తున్న 'హలో' చిత్రం డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య నటిస్తున్న 'గ్యాంగ్‌' వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com