వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలలో 50 శాతం రాయితీ ప్రకటించిన క్రౌన్‌ప్రిన్స్

- December 02, 2017 , by Maagulf
వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలలో 50 శాతం రాయితీ  ప్రకటించిన క్రౌన్‌ప్రిన్స్

అబుదాబి : నేడు యూఏఈ జాతీయ దినోత్సవం (డిసెంబర్ 2) సందర్భంగా అక్కడి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు, నేరాలకు పాల్పడి చెల్లించాల్సిన జరిమానాల్లో 50 శాతం మినహాయింపునిచ్చారు. ఈ మేరకు క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి, డిఫ్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్‌డ్ ఫోర్సెస్ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఆయన  ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు సంబంధింత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అన్నీ శాఖలు సమన్వయంతో పని చేసి జరిమానాలకు 50 శాతం డిస్కౌంట్‌ ఇవ్వాలని ఆదేశించారు. మొదటగా అబుదాబి నగర అధికారులు జరిమానాలకు డిస్కౌంట్ ఇస్తున్నామని ప్రకటించారు. ఈ వెసులుబాటును దేశవ్యాప్తంగా అందరికీ వర్తింపజేయాలని ఆయన ప్రకటించారు. డిసెంబర్ 2 వ తేదీ నుంచి రెండు నెలలపాటు ఈ చెల్లింపులు జరిపే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత ఆ అవకాశం ఉండదని  అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com