పర్యాటక వీసాపై వెళ్లి...దుబాయ్ లో దొంగతనం చేసిన చైనా యువకులు

- December 02, 2017 , by Maagulf
పర్యాటక వీసాపై వెళ్లి...దుబాయ్ లో  దొంగతనం చేసిన చైనా యువకులు

దుబాయ్: చుట్టపు చూపుగా వెళ్లిన  పర్యాటక వీసాపై దుబాయ్ వెల్లిన ఇరువురు చైనా యువకులు ఇళ్లకు కన్నం వేసి జైలుపాలయ్యారు. 25, 31 ఏళ్ల వయసున్న ఇద్దరు చైనా  యువకులు పర్యాటక వీసా తీసుకుని దుబాయ్ నగరం వెళ్లారు. నగర అందాలను ఆశ్వాదించి తిరిగివెళ్లకుండా దొంగతనానికి పాల్పడ్డారు. ఎవరూలేని ఓ భవనాన్ని పరిశీలించి దొంగతనం చేశారు. 8 లక్షల దిర్హమ్‌ల విలువైన బంగారం, 2 లక్షల దిర్హమ్‌ల నగదు దొంగతనానికి పాల్పడ్డారు. పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చి బాధిత కుటుంబం కంగుతింది. ఇంట్లో బంగారం, డబ్బు దొంగతనానికి గురయ్యాయని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు సీసీ కెమేరాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఒక్కొక్కరికి రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. వీరికి సహాయం చేసిన మరో వ్యక్తికి కూడా శిక్ష విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com