పెరిగిన లడ్డూ ధరలు

- December 03, 2017 , by Maagulf
పెరిగిన లడ్డూ ధరలు

లడ్డూ ప్రసాదం అంటే తిరుమల ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం శ్రీవారి ప్రసాదాల ధరలు రెట్టింపయ్యాయి. టీటీడీ దేశ వ్యాప్తంగా నిర్వహించే కల్యాణోత్సవాలు, ఇతర ఉత్సవాలు, భక్తి కార్యక్రమాలకు సప్లయ్‌ చేసే లడ్డూ ధరలను అధికారులు పెంచారు.
ధరల వివరాల్లోకి వెళితేౌ చిన్న లడ్డూ ధర రూ. 25 నుంచి రూ. 50కి పెంచామని, కల్యాణం లడ్డూ ధర రూ. 100 నుంచి రూ. 200కి పెంచామని తెలిపారు. వడ ధర రూ. 25 నుంచి రూ. 100కి పెంచినట్లు వెల్లడించారు. సిఫార్సులపై ప్రసాదాలు ఇచ్చే విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించామని టీటీడీ తెలిపింది. రూ. 50 లడ్డూలను భక్తులకు కోరినన్ని ఇచ్చేలా టీటీడీ ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com