ద్రాక్షలతో మతిమరుపు మటాష్
- December 07, 2017
ద్రాక్షల్లోని పోషకాలు దంతక్షయాన్ని నివారిస్తాయి. దంతాలకు బలాన్నిస్తాయి. ద్రాక్షపండ్లను తరచూ తింటే మతిమరుపు దూరం అవుతుంది. గుండె జబ్బులు దరి చేరవు. వర్షాకాలం, చలికాలంలో వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే తేనెను రెండు స్పూన్లు తీసుకోవాలి. తేనె దగ్గును నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.
క్యాబేజీ చర్మం నిగారింపును కోల్పోకుండా చేస్తుంది. క్యాలీఫ్లవర్ కూడా ఫ్లూ, జలుబును నిరోధిస్తుంది. పాలకూర శ్వాస సమస్యలను నివారిస్తుంది. నట్స్ రోజుకు అర గుప్పెడు తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత క్రమంగా వుంటుంది.
* గుండె జబ్బులకు మష్రూమ్స్ మంచి మందుగా పనిచేస్తాయి. పుట్టగొడుగుల సూప్ తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గుతుంది. యాంటీ-ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తుంది. ఇందులోని లెంటిసైన్, ఎరిటడెనిన్ రక్తంలోని కొవ్వును కరిగిస్తాయి.
* ఉదయాన్నే నిద్రలేవడం.. ఉదయం 8.30 గంటల్లోపు అల్పాహారాన్ని తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు నడవాలి. రాత్రి భోజనం 8 గంటల్లోపు పూర్తిచేయాలి. రాత్రి పది గంటల్లోపు నిద్రించాలి. నూనె వంటకాలను అతిగా తినకపోవడం మంచిది. రోజుకు గరిష్ఠంగా రెండుసార్లు మాత్రమే టీ,కాఫీలు తీసుకోవాలి. బాగా అలసిపోయినట్లు అనిపిస్తే.. ఒక్కసారిగా బరువు పెరిగినట్లు అనిపిస్తే నిమ్మరసం తాగాలి.
వాల్ నట్స్ తినడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బాదంపప్పుతో శరీర రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. పిస్తా పప్పులు తినడం ద్వారా కండరాల నొప్పులు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్తహీనతను నివారించుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







