సినిమాలకు వీడ్కోలు చెప్పేస్తానంటున్న పవన్ కళ్యాణ్
- December 08, 2017
విజయవాడ: విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సమావేశంలో మాట్లాడుతూ...పరిటాల రవి నాకు గుండు కొట్టించాడనేది పచ్చి అబద్ధం అని పవన్ స్పష్టం చేశారు. అది టిడిపి వాళ్లు సృష్టించిన ప్రచారం అని పవన్ కొట్టిపారేశారు. సినిమాలపై చికాకు వచ్చి నేనే గుండు కొట్టించుకున్నానని పవన్ తెలిపారు. ఈ ప్రచారం మొదలైనప్పుడు పరిటాల రవి ఎవరో నాకు తెలియదని పవన్ పేర్కొన్నారు. ప్రజల కోసమే టిడిపికి మద్దతిచ్చాను. వైఎస్ జగన్పై అభియోగాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తికి నేను ఎందుకు మద్దతిస్తానని పవన్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కంటే ఏపిలో కుల పిచ్చి ఎక్కువగా ఉందని, ఈమేరకు కుల పిచ్చి వదుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని పవన్ పేర్కొన్నారు. నిరాయధుడిగా ఉన్న రంగాను చంపడం తప్పని, రంగా ప్రస్తావన లేకుండా బెజవాడ రాజకీయాలు లేవని పవన్ వెల్లడించారు. ఇక సినిమాలు వదిలేస్తున్నానని పవన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







