సినిమాలకు వీడ్కోలు చెప్పేస్తానంటున్న పవన్ కళ్యాణ్
- December 08, 2017
విజయవాడ: విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సమావేశంలో మాట్లాడుతూ...పరిటాల రవి నాకు గుండు కొట్టించాడనేది పచ్చి అబద్ధం అని పవన్ స్పష్టం చేశారు. అది టిడిపి వాళ్లు సృష్టించిన ప్రచారం అని పవన్ కొట్టిపారేశారు. సినిమాలపై చికాకు వచ్చి నేనే గుండు కొట్టించుకున్నానని పవన్ తెలిపారు. ఈ ప్రచారం మొదలైనప్పుడు పరిటాల రవి ఎవరో నాకు తెలియదని పవన్ పేర్కొన్నారు. ప్రజల కోసమే టిడిపికి మద్దతిచ్చాను. వైఎస్ జగన్పై అభియోగాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తికి నేను ఎందుకు మద్దతిస్తానని పవన్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కంటే ఏపిలో కుల పిచ్చి ఎక్కువగా ఉందని, ఈమేరకు కుల పిచ్చి వదుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని పవన్ పేర్కొన్నారు. నిరాయధుడిగా ఉన్న రంగాను చంపడం తప్పని, రంగా ప్రస్తావన లేకుండా బెజవాడ రాజకీయాలు లేవని పవన్ వెల్లడించారు. ఇక సినిమాలు వదిలేస్తున్నానని పవన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్









