కువైట్ విశ్వవిద్యాలయంలో భారతీయ విద్యార్థికి స్కాలర్ షిప్
- December 08, 2017
కువైట్ : కువైట్ విశ్వవిద్యాలయం ఓ భారతీయ విద్యార్థి ప్రతిభకు పట్టం కట్టనుంది.12 వ తరగతిలో అత్యధిక మార్కులు పొందిన భారతీయ విద్యార్ధికి ఉపకారవేతనం పొందే అవకాశంను కువైట్ ప్రభుత్వం కల్పించింది. విశ్వవిద్యాలయం 2017-18 రెండవ విద్యా సంవత్సరంకు సంబంధించి ఈ సదుపాయం కల్పించనుంది.12 వ గ్రేడ్ బోర్డు పరీక్షల ఉత్తీర్ణత పొందిన వారు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులు. ఈ మేరకు కువైట్ యూనివర్శిటీ నుండి దరఖాస్తుపత్రాన్ని పొందవచ్చు. భారతదేశం యొక్క ఎంబసీ యొక్క ఎడ్యుకేషన్ విభాగానికి పూర్తిచేసిన దరఖాస్తును డిసెంబరు 28 వ తేదీ లోపున సమర్పించవచ్చు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే 12 వ తరగతి లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థికి సంబంధిత కువైట్ లోని భారత రాయబార అధికారులు సిఫార్సు చేయాలనీ కోరింది..స్కాలర్ షిప్ విద్యార్ధి పొందే విద్యా అర్హత పరీక్షను కువైట్ విశ్వవిద్యాలయం 2018 జనవరి 29, సోమవారం నిర్వహించబడుతుంది. తదుపరి విచారణలకు, ఆసక్తి గల విద్యార్ధులు మరింత సమాచారం కొరకు శ్రీ సంజీవ్ సక్లని, అటాచీ (విద్య / కాన్యులర్) ఆఫీస్ టెలిఫోన్ నంబర్ 22522215 మరియు మొబైల్ నెంబర్ 97295728 సంప్రదించండి.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!