రానా తో మరో మల్టీస్టారర్ మూవీ తీయనున్న కృష్ణవంశి
- December 09, 2017
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు గులాబీ, మురారి, ఖడ్గం,చందమామ లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన కృష్ణ వంశి గత కొంత కాలంగా పెద్దగా విజయాలు అందుకోలేక పోతున్నారు. ఆ మద్య మెగా అబ్బాయి రాంచరణ్ తో తీసిన సినిమా 'గోవిందుడు అందరి వాడేలే' కథ పరంగా బాగుందీ అనిపించుకున్నా కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఈ సంవత్సరం 'నక్షత్రం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కాకపోతే ఈ సినిమా గత సంవత్సరం నుంచి వాయిదాలు పడుతూ..సినిమా పై ఉన్న అంచనాలు తగ్గిపోయాయి. దీంతో థియేటర్లో 'నక్షత్రం' పెద్దగా అలరించలేక పోయింది. సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్ లు కలిసి నటించిన ఈ సినిమా అంచనాలు తలకిందులు చేసింది. ఇక ఆయన నుంచి మరో సినిమా రావడానికి చాలా సమయం పట్టొచ్చని అనుకున్నారు. అయితే ఇప్పుడు కృష్ణవంశి మరో అద్భుతమైన మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నాడట.
ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్న ఆయన, ఒక హీరోగా మాధవన్ ను ఎంపిక చేసుకున్నట్టుగా చెబుతున్నారు. బాహుబలి సిరీస్ తో జాతీయ స్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రానా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడు. మాధవన్ .. రానా పాత్రలు నువ్వా .. నేనా? అన్నట్టుగా ఉంటాయట. ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తారట.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







