ఉగ్రవాదాన్ని సహించేది లేదు...రష్యా, ఇండియా, చైనా స్పష్టీకరణ
- December 11, 2017
న్యూదిల్లీ: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న సహించేది లేదని, దాన్ని నిరోధించేందుకు కలిసికట్టుగా పోరాడతామని భారత్, రష్యా, చైనా స్పష్టంచేశాయి. మూడు దేశాల విదేశాంగ మంత్రుల 15వ సమావేశం అనంతరం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. తాము ఏ ఒక్క దేశాన్ని ఉద్దేశించి సంఘటితం కాలేదని, అన్ని దేశాలు కూడా ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చాయి.
అంతకుముందు రష్యా, ఇండియా, చైనా (ఆర్ఐసీ కూటమి) విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తో సుష్మాస్వరాజ్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న కీలకమైన సమస్యలపై చర్చించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లావ్రోవ్తోనూ సుష్మ విడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచే అంశాలపై చర్చించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్కుమార్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







