ఉగ్రవాదాన్ని సహించేది లేదు...రష్యా, ఇండియా, చైనా స్పష్టీకరణ
- December 11, 2017
న్యూదిల్లీ: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న సహించేది లేదని, దాన్ని నిరోధించేందుకు కలిసికట్టుగా పోరాడతామని భారత్, రష్యా, చైనా స్పష్టంచేశాయి. మూడు దేశాల విదేశాంగ మంత్రుల 15వ సమావేశం అనంతరం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. తాము ఏ ఒక్క దేశాన్ని ఉద్దేశించి సంఘటితం కాలేదని, అన్ని దేశాలు కూడా ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చాయి.
అంతకుముందు రష్యా, ఇండియా, చైనా (ఆర్ఐసీ కూటమి) విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తో సుష్మాస్వరాజ్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న కీలకమైన సమస్యలపై చర్చించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లావ్రోవ్తోనూ సుష్మ విడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచే అంశాలపై చర్చించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్కుమార్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







