స్వాధీనం కాబడిన 500 పైగా వాహనాలను ఆయా యజమానులకు విడుదల
- December 12, 2017
కువైట్ : ఫెర్వనియా గవర్నరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన పలు వాహనాలను వాహన నిర్బంధ విభాగం ఇటీవల స్వాధీనం చేసుకొంది. ప్రస్తుతం సంబంధిత వాహన యజమానులు విధించబడిన జరిమానాలను పరిష్కరించుకున్నారు. దీంతో 500 పైగా వాహనాలను వాహన నిర్బంధ విభాగం విడుదల చేసింది. అల్-ఖాబాస్ దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం ఏ ఒక్కరితో ఎటువంటి ప్రధాన సమస్యలు తలత్తేకుండా వారి విధులను సక్రమంగా నిర్వర్తించడంలో అధికారులు చక్కని కార్యదక్షత ప్రదర్శించారని ప్రశంసించింది. నగరాన్ని చూసేందుకు వచ్చిన సందర్శకులు వారి పత్రాలను పరిశీలించడానికి వారిని నేరుగా సంబంధిత యూనిట్లకు మార్గనిర్దేశం చేశారు. ట్రాఫిక్ చట్టం169 ఆర్టికల్ అమలు తర్వాత ట్రాఫిక్ ప్రచారాలు తీవ్రతరం అయ్యాయి. పార్కింగ్ కానీ లేదా పాదచారులకు మరియు కాలిబాటలకు ప్రత్యేక ప్రదేశాలలో వాహనాలను నిషేధం అమలుచేయబడుతుంది. డ్రైవింగ్ చేసేసమయంలో ఒక చేతితో ఫోన్ మాట్లాడటం ఆర్టికల్ 207 లో ట్రాఫిక్ నేరంగా పరిగణించబడుతుంది. అలాగే వాహనంలో ముందు సీట్లలో కూర్చున్నవారు సీట్ బెల్ట్ అమర్చుకోకపోవడం మరియు ద్విచక్రవాహనదారులు శిరస్త్రాణాలు ( హెల్మెట్స్ ) ధరించకపోయిన వారిపై ట్రాఫిక్ చట్టం అమలు కాబడుతుంది.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







