నాసా: మరో రెండు రోజుల్లో వీడనున్న ఏలియెన్స్ మిస్టరీ
- December 12, 2017
గ్రహాంతర వాసుల ఉనికి మీద ఏళ్ళతరబడి ప్రపంచ ప్రజలను, శాస్త్రజ్ఞులను ఊరిస్తున్న సస్పెన్స్ ఈ నెల 14 న వీడనుంది. మరో రెండు రోజుల్లో ఈ మిస్టరీకి తెరపడబోతోంది.. ఏలియెన్స్ గుట్టును గురువారం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా విప్పేస్తుందట. ఆ రోజు లైవ్గా నిర్వహించనున్న కాన్ఫరెన్స్లో.. కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించిన విషయాలను శాస్త్రజ్ఞులు వెల్లడించనున్నారు.
ఈ టెలిస్కోప్ 2009 నుంచే గ్రహాంతరవాసుల జాడ కోసం అన్వేషిస్తోంది. ఇది అందించిన డేటాను గూగుల్ మెషిన్ లెర్నింగ్ సాయంతో విశ్లేషించారు. ఈ మెషిన్...ఓ కృత్రిమ ఇంటలిజెన్స్ అని, కెప్లర్ డేటాను విశ్లేషించడానికి ఇది తోడ్పడిందని నాసా ప్రకటించింది.
ఈ నెల 14 న జరిగే కాన్ఫరెన్స్ లో నాసా ఆస్ట్రో ఫిజిక్స్ డివిజన్ డైరెక్టర్ పాల్ హెర్జ్, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ క్రిస్టఫర్ షాల్యూ, నాసా సాగన్ పోస్ట్ డాక్టోరల్ ఆస్త్రనమర్ ఆండ్రూ వాండర్ బర్గ్, నాసా కెప్లర్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త జెస్సీ డాట్స న్ పాల్గొని గ్రహాంతరవాసుల మిస్టరీని ఈ ప్రపంచానికి వివరించనున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







