నాసా: మరో రెండు రోజుల్లో వీడనున్న ఏలియెన్స్ మిస్టరీ
- December 12, 2017
గ్రహాంతర వాసుల ఉనికి మీద ఏళ్ళతరబడి ప్రపంచ ప్రజలను, శాస్త్రజ్ఞులను ఊరిస్తున్న సస్పెన్స్ ఈ నెల 14 న వీడనుంది. మరో రెండు రోజుల్లో ఈ మిస్టరీకి తెరపడబోతోంది.. ఏలియెన్స్ గుట్టును గురువారం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా విప్పేస్తుందట. ఆ రోజు లైవ్గా నిర్వహించనున్న కాన్ఫరెన్స్లో.. కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించిన విషయాలను శాస్త్రజ్ఞులు వెల్లడించనున్నారు.
ఈ టెలిస్కోప్ 2009 నుంచే గ్రహాంతరవాసుల జాడ కోసం అన్వేషిస్తోంది. ఇది అందించిన డేటాను గూగుల్ మెషిన్ లెర్నింగ్ సాయంతో విశ్లేషించారు. ఈ మెషిన్...ఓ కృత్రిమ ఇంటలిజెన్స్ అని, కెప్లర్ డేటాను విశ్లేషించడానికి ఇది తోడ్పడిందని నాసా ప్రకటించింది.
ఈ నెల 14 న జరిగే కాన్ఫరెన్స్ లో నాసా ఆస్ట్రో ఫిజిక్స్ డివిజన్ డైరెక్టర్ పాల్ హెర్జ్, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ క్రిస్టఫర్ షాల్యూ, నాసా సాగన్ పోస్ట్ డాక్టోరల్ ఆస్త్రనమర్ ఆండ్రూ వాండర్ బర్గ్, నాసా కెప్లర్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త జెస్సీ డాట్స న్ పాల్గొని గ్రహాంతరవాసుల మిస్టరీని ఈ ప్రపంచానికి వివరించనున్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు