శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

- December 13, 2017 , by Maagulf
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

సింగపూర్‌ నుంచి చెన్నై వెళ్తున్నఇండిగో విమానం శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. చెన్నై ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ విమానాన్ని శంషాబాద్‌కు మళ్లించారు. దాదాపు 151 మంది ప్రయాణీకులతో సింగపూర్‌ నుంచి చెన్నైకి బయలుదేరింది విమానం. కానీ చెన్నై ఎయిర్‌పోర్టులో పొగమంచు కమ్మేసింది. రన్‌ వే పై విజుబులిటీ లేదని సమాచారం అందడంతో..  అత్యవసరంగా హైదరాబాద్‌కు రూటు మార్చారు.. విమానం సేఫ్‌గా ల్యాండ్‌ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com