నగర వాసుల్ని కలిసి బాదేద్దాం.. మెట్రో ఓలా చెట్టపట్టాల్
- December 13, 2017
హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ ఓలా క్యాబ్స్తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 'టీసవారి' అంటూ ఓ యాప్ని ప్రయాణీకుల ముందుకు తెచ్చింది. ఈ యాప్లో ఓలా మనీతో పాటు ఓలా సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ నుంచే ఓలాకు సంబంధించిన వాహనాల్ని బుక్ చేసుకోవచ్చు. మెట్రో స్మార్ట్ కార్డులను కూడా ఓలా మనీ వ్యాలెట్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మెట్రో రైల్ సీఈవో అనిల్ కుమార్ శైనీ మాట్లాడుతూ, ఓలాతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని, ఈ సదుపాయం వల్ల ప్రయాణికులకు స్టేషన్కు రావడానికి, వెళ్లడానికి ఈజీగా ఉంటుందని చెప్పారు. ఊహించినట్లుగానే మెట్రోకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!