కల్వరి సబ్ మెరైన్ ను జాతికి అంకితం చేసిన మోడీ
- December 13, 2017

ముంబై : దాదాపు 17 ఏళ్ల నౌకాదళ కల నెరవేరింది. మేడిన్ ఇండియా స్కార్పియన్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరి నేవీలో గురువారం భాగమైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఎన్ఎస్ కల్వరిని నౌకాదళానికి అప్పగిస్తూ జాతికి అంకితం చేశారు. ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ సహకారంతో ఐఎన్ఎస్ కల్వరి నిర్మాణం జరిగింది. హిందూ మహా సముద్రంలో ఇష్టానుసారం తిరుగుతున్న చైనా యుద్ధనౌకలకు దీనితో చెక్ పెట్టొచ్చు.
ఐఎన్ఎస్ కల్వరీని స్కార్పియన్ తరగతికి చెందిన జలాంతర్గామిని జాతికి అంకితం చేయడం అనేది మేకిన్ ఇండియా పథకానికి అతి పెద్ద బలాన్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ డీజిల్-ఎలక్ట్రికల్ సబ్మెరైన్ను ముంబైలోని మాజగాన్ డాక్యార్డ్లో నిర్మించారు. ఆరు సబ్ మెరైన్ల నిర్మాణంలో భాగంగా మొదటి జలాంతర్గామిని ప్రభుత్వం నేవీకి అప్పగించింది. కల్వరీ సబ్ మెరైన్ పరీక్ష దశలో 120 రోజుల పాటు సముద్రంలో ప్రయాణించింది. ఫ్రాన్స్ నావల్ డిఫెన్స్ అండ్ ఎనర్జీ కంపెనీ డిజైన్ ఆధారంగా కల్వరీ నిర్మాణం జరిగింది.
ఐఎన్ఎస్ కల్వరీని జాతికి అంకితం చేస్తూ.. భారత్-ఫ్రాన్స్ మధ్య వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇదొక నిదర్శనం అని ప్రధాని మోదీ చెప్పారు. 1.566 టన్నుల బరువైన ఈ సబ్ మెరైన్ టైగర్ షార్క్ తరహాలో హిందూ మహాసముద్రంలో డీప్ సీ ప్రెడేటర్గా అత్యంత సమర్థవంతంగా పనిచేయనుందన్నారు. సముద్ర మార్గం ద్వారా ప్రవేశించే ఉగ్రవాదం, డ్రగ్స్ రవాణా, అక్రమ చేపల వేటను మరింత సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో భారత్ మరింత కీలక భూమిక పోషించనుందని తెలిపారు.
ఇదిలా ఉండగా.. భారత్ 1980, 1990లలో రష్యా, జర్మనీల నుంచి జలాంతర్గాములను నౌకాదళం సమకూర్చుకుంది. జర్మన్ సబ్మెరైన్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు రావడంతో తరువాత ప్రభుత్వాలు వీటి కొనుగోలుకు వెనకడుగు వేశాయి. చివరిసారిగా 2000 సంవత్సరంలో ‘ఐఎన్ఎస్ సింధురాష్ట్ర’ అనే సంప్రదాయ జలాంతర్గామి భారత నౌకాదళంలో చేరింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, భారత నావికాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబ, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, భారత నావికాదళ సీనియర్ అధికారులు, ఫ్రాన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







