363 మంది కువైటీలకు హెచ్ఐవీ
- December 13, 2017
కువైట్: మొత్తం 363 మంది కువైటీ జాతీయులు హెచ్ఐవీ బారిన పడ్డారనీ, వారికి వైద్య చికిత్స అందుతోందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. మినిస్ట్రీ త్వరలో క్లినిక్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్లినిక్ ద్వారా కువైట్లో వుండేవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి వైద్య చికిత్సను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకో వైపున హెచ్ఐవీ పట్ల అవగాహన పెంచేందుకు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు మినిస్ట్రీ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ జనరల్ హెల్త్ మజ్దా అల్ ఖట్టాన్ చెప్పారు. 2021 నాటికి హెచ్ఐవీ కేసుల సంఖ్యను సగానికి తగ్గించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. మిడిల్ ఈస్ట్లో కువైట్, హెచ్ఐవీ ట్రీట్మెంట్ విభాగంలో అత్యున్నతస్థాయిలో పనిచేస్తోందని మినిస్ట్రీ పేర్కొంది. నేషనల్ క్యాంపెయిన్లో 81 శాతం హెచ్ఐవీ పాజిటివ్ పేషెంట్లను గుర్తించి, వారికి అవగాహన కల్పించడం జరిగింది. వారికి యాంటీరిట్రోవైరల్ డ్రగ్స్ అందించడం జరుగుతోంది. 90 శాతం మందిలో అన్ డిటెక్టబుల్ స్టేజ్లో వైరల్ లోడ్ ఉండడం గమనించదగ్గ అంశంగా మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







