363 మంది కువైటీలకు హెచ్ఐవీ
- December 13, 2017
కువైట్: మొత్తం 363 మంది కువైటీ జాతీయులు హెచ్ఐవీ బారిన పడ్డారనీ, వారికి వైద్య చికిత్స అందుతోందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. మినిస్ట్రీ త్వరలో క్లినిక్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్లినిక్ ద్వారా కువైట్లో వుండేవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి వైద్య చికిత్సను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకో వైపున హెచ్ఐవీ పట్ల అవగాహన పెంచేందుకు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు మినిస్ట్రీ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ జనరల్ హెల్త్ మజ్దా అల్ ఖట్టాన్ చెప్పారు. 2021 నాటికి హెచ్ఐవీ కేసుల సంఖ్యను సగానికి తగ్గించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. మిడిల్ ఈస్ట్లో కువైట్, హెచ్ఐవీ ట్రీట్మెంట్ విభాగంలో అత్యున్నతస్థాయిలో పనిచేస్తోందని మినిస్ట్రీ పేర్కొంది. నేషనల్ క్యాంపెయిన్లో 81 శాతం హెచ్ఐవీ పాజిటివ్ పేషెంట్లను గుర్తించి, వారికి అవగాహన కల్పించడం జరిగింది. వారికి యాంటీరిట్రోవైరల్ డ్రగ్స్ అందించడం జరుగుతోంది. 90 శాతం మందిలో అన్ డిటెక్టబుల్ స్టేజ్లో వైరల్ లోడ్ ఉండడం గమనించదగ్గ అంశంగా మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







