మూడు నెలల తర్వాత చూడండి: మంత్రి నారాయణ
- December 14, 2017
మంగళగిరి : 'రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇంకో మూడు నెలల తర్వాత వచ్చి చూడండి. రాజధానిలో ఎటుచూసినా ముమ్మరంగా పనులు జరుగుతూ కనిపిస్తాయి. అమరావతి ప్రపంచంలోని ఐదు ముఖ్య నగరాల్లో ఒకటిగా నిలిచి తీరుతుంది.' అని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని ఎర్రబాలెంలో ఎన్టీఆర్ క్యాంటీన్ను గురువారం ఆయన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నారాయణ మాట్లాడుతూ 'ఒక ఇంటి ప్లాను డిజైన్ కోసమే నెలల సమయం తీసుకునే ఈ రోజుల్లో ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన రాజధాని డిజైన్లను ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోలేదన్నారు. 'ప్రస్తుతం రాజధాని డిజైన్లన్నీ ఖరారయ్యాయి. మూడేళ్లలో ఓ మంచి రాజధానిని నిర్మిస్తామని తొలుత చెప్పాం. ఎక్కువ నాణ్యతతో చేయాలన్న ఉద్దేశంతో కొంత సమయం తీసుకోవల్సి వచ్చింది.' అని వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







