మూడు నెలల తర్వాత చూడండి: మంత్రి నారాయణ

- December 14, 2017 , by Maagulf
మూడు నెలల తర్వాత చూడండి: మంత్రి నారాయణ

మంగళగిరి : 'రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇంకో మూడు నెలల తర్వాత వచ్చి చూడండి. రాజధానిలో ఎటుచూసినా ముమ్మరంగా పనులు జరుగుతూ కనిపిస్తాయి. అమరావతి ప్రపంచంలోని ఐదు ముఖ్య నగరాల్లో ఒకటిగా నిలిచి తీరుతుంది.' అని మునిసిపల్‌ శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని ఎర్రబాలెంలో ఎన్టీఆర్‌ క్యాంటీన్‌ను గురువారం ఆయన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నారాయణ మాట్లాడుతూ 'ఒక ఇంటి ప్లాను డిజైన్‌ కోసమే నెలల సమయం తీసుకునే ఈ రోజుల్లో ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన రాజధాని డిజైన్లను ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోలేదన్నారు. 'ప్రస్తుతం రాజధాని డిజైన్లన్నీ ఖరారయ్యాయి. మూడేళ్లలో ఓ మంచి రాజధానిని నిర్మిస్తామని తొలుత చెప్పాం. ఎక్కువ నాణ్యతతో చేయాలన్న ఉద్దేశంతో కొంత సమయం తీసుకోవల్సి వచ్చింది.' అని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com