విఐపి ఉచిత దర్శనాల పై మండిపడుతున్న శ్రీవారి భక్తులు
- December 15, 2017
లియుగ దైవం వెంకటేశ్వర స్వామికి కమిటీల భారం ఎక్కువైంది. ప్రోటోకాల్ పేరుతో వందల మంది ఉచిత దర్శనాలు చేసుకుంటూ స్వామివారి ఆదాయానికి గండికొడుతున్నారు. అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ మూర్తి మరో ముగ్గురితో కలిసి వెంకన్న దర్శనానికి వచ్చారు. వీరితో పాటు దాదాపు వంద మంది L 1 దర్శనాలు చేసుకున్నారు. వారందరికీ టీటీడీ అధికారులు సముచిత మర్యాదలు చేశారు. ఈ తతంగంపై భక్తులు మండిపడ్డారు. కమిటీల పేరుతో వచ్చిన వారితో తమకు దర్శనం ఆలస్యం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతులు చెప్పేవారే ఇలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నించారు.
గడచిన వారం రోజుల్లోనే నాలుగు కమిటీలు తిరుమలకు విచ్చేశాయి. అసలు సభ్యులు ఇద్దరు ముగ్గురుంటే... వారితో వచ్చేవారు వందమంది దాకా ఉంటున్నారు. వారందరికీ వసతి, దర్శనాలు, ప్రసాదాలు కూడా ఉచితంగా అందించాల్సి వస్తోంది. దీంతో అనవసర ఇబ్బందులు తలెత్తడంతో పాటు... టీటీడీ ఆదాయానికీ గండి పడుతోంది. కమిటీల పేరుతో సాగుతున్న ఈ తంతుపై భక్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వమే దీనిపై దృష్టిసారించి... కఠిన నియమావళి రూపొందించాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







