విఐపి ఉచిత దర్శనాల పై మండిపడుతున్న శ్రీవారి భక్తులు
- December 15, 2017
లియుగ దైవం వెంకటేశ్వర స్వామికి కమిటీల భారం ఎక్కువైంది. ప్రోటోకాల్ పేరుతో వందల మంది ఉచిత దర్శనాలు చేసుకుంటూ స్వామివారి ఆదాయానికి గండికొడుతున్నారు. అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ మూర్తి మరో ముగ్గురితో కలిసి వెంకన్న దర్శనానికి వచ్చారు. వీరితో పాటు దాదాపు వంద మంది L 1 దర్శనాలు చేసుకున్నారు. వారందరికీ టీటీడీ అధికారులు సముచిత మర్యాదలు చేశారు. ఈ తతంగంపై భక్తులు మండిపడ్డారు. కమిటీల పేరుతో వచ్చిన వారితో తమకు దర్శనం ఆలస్యం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతులు చెప్పేవారే ఇలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నించారు.
గడచిన వారం రోజుల్లోనే నాలుగు కమిటీలు తిరుమలకు విచ్చేశాయి. అసలు సభ్యులు ఇద్దరు ముగ్గురుంటే... వారితో వచ్చేవారు వందమంది దాకా ఉంటున్నారు. వారందరికీ వసతి, దర్శనాలు, ప్రసాదాలు కూడా ఉచితంగా అందించాల్సి వస్తోంది. దీంతో అనవసర ఇబ్బందులు తలెత్తడంతో పాటు... టీటీడీ ఆదాయానికీ గండి పడుతోంది. కమిటీల పేరుతో సాగుతున్న ఈ తంతుపై భక్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వమే దీనిపై దృష్టిసారించి... కఠిన నియమావళి రూపొందించాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







