ఐఎస్ ఉగ్రవాదులపై ముప్పేట దాడి మొదలైంది

- November 18, 2015 , by Maagulf
ఐఎస్ ఉగ్రవాదులపై ముప్పేట దాడి మొదలైంది

పారిస్‌లో నరమేధానికి పాల్పడిన ఐఎస్ ఉగ్రవాదులపై ముప్పేట దాడి మొదలైంది. ఒకవైపు.. బాధిత దేశం ఫ్రాన్స్ ముమ్మరంగా దాడులు జరుపుతుండగా, మరోవైపు రష్యా కూడా దాడులు ప్రారంభించింది. ఇందులోభాగంగా.. సిరియాలోని రఖాపై వైమానిక దాడులు జరిపింది. ఐఎస్‌కు అప్రకటిత రాజధానిగా చలామణి అవుతున్న రఖాలోని ఉగ్రవాదుల కమాండ్ సెంటర్, శిక్షణ కేంద్రంపై మంగళవారం బాంబుల వర్షం కురిపించి ధ్వంసం చేసింది. ఐఎస్ స్థావరాలపై 24 గంటల్లో ఇది రెండో వైమానిక దాడి అని ఫ్రాన్స్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అమెరికా సేనలతో కలిసి జరిపిన ఈ దాడిలో 10 రాఫెల్, మిరేజ్-2000 యుద్ధ విమానాలతో 16 బాంబులు వేసినట్లు పేర్కొన్నది. కాగా దాడుల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న యుద్ధ విమానాలకు తోడు చార్లెస్ డి గాలే యుద్ధనౌకను కూడా చేర్చాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com