ఐఎస్ ఉగ్రవాదులపై ముప్పేట దాడి మొదలైంది
- November 18, 2015
పారిస్లో నరమేధానికి పాల్పడిన ఐఎస్ ఉగ్రవాదులపై ముప్పేట దాడి మొదలైంది. ఒకవైపు.. బాధిత దేశం ఫ్రాన్స్ ముమ్మరంగా దాడులు జరుపుతుండగా, మరోవైపు రష్యా కూడా దాడులు ప్రారంభించింది. ఇందులోభాగంగా.. సిరియాలోని రఖాపై వైమానిక దాడులు జరిపింది. ఐఎస్కు అప్రకటిత రాజధానిగా చలామణి అవుతున్న రఖాలోని ఉగ్రవాదుల కమాండ్ సెంటర్, శిక్షణ కేంద్రంపై మంగళవారం బాంబుల వర్షం కురిపించి ధ్వంసం చేసింది. ఐఎస్ స్థావరాలపై 24 గంటల్లో ఇది రెండో వైమానిక దాడి అని ఫ్రాన్స్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అమెరికా సేనలతో కలిసి జరిపిన ఈ దాడిలో 10 రాఫెల్, మిరేజ్-2000 యుద్ధ విమానాలతో 16 బాంబులు వేసినట్లు పేర్కొన్నది. కాగా దాడుల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న యుద్ధ విమానాలకు తోడు చార్లెస్ డి గాలే యుద్ధనౌకను కూడా చేర్చాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









