ఐఎస్ ఉగ్రవాదులపై ముప్పేట దాడి మొదలైంది
- November 18, 2015
పారిస్లో నరమేధానికి పాల్పడిన ఐఎస్ ఉగ్రవాదులపై ముప్పేట దాడి మొదలైంది. ఒకవైపు.. బాధిత దేశం ఫ్రాన్స్ ముమ్మరంగా దాడులు జరుపుతుండగా, మరోవైపు రష్యా కూడా దాడులు ప్రారంభించింది. ఇందులోభాగంగా.. సిరియాలోని రఖాపై వైమానిక దాడులు జరిపింది. ఐఎస్కు అప్రకటిత రాజధానిగా చలామణి అవుతున్న రఖాలోని ఉగ్రవాదుల కమాండ్ సెంటర్, శిక్షణ కేంద్రంపై మంగళవారం బాంబుల వర్షం కురిపించి ధ్వంసం చేసింది. ఐఎస్ స్థావరాలపై 24 గంటల్లో ఇది రెండో వైమానిక దాడి అని ఫ్రాన్స్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అమెరికా సేనలతో కలిసి జరిపిన ఈ దాడిలో 10 రాఫెల్, మిరేజ్-2000 యుద్ధ విమానాలతో 16 బాంబులు వేసినట్లు పేర్కొన్నది. కాగా దాడుల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న యుద్ధ విమానాలకు తోడు చార్లెస్ డి గాలే యుద్ధనౌకను కూడా చేర్చాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







