ఐఎస్ ఉగ్రవాదులపై ముప్పేట దాడి మొదలైంది
- November 18, 2015
పారిస్లో నరమేధానికి పాల్పడిన ఐఎస్ ఉగ్రవాదులపై ముప్పేట దాడి మొదలైంది. ఒకవైపు.. బాధిత దేశం ఫ్రాన్స్ ముమ్మరంగా దాడులు జరుపుతుండగా, మరోవైపు రష్యా కూడా దాడులు ప్రారంభించింది. ఇందులోభాగంగా.. సిరియాలోని రఖాపై వైమానిక దాడులు జరిపింది. ఐఎస్కు అప్రకటిత రాజధానిగా చలామణి అవుతున్న రఖాలోని ఉగ్రవాదుల కమాండ్ సెంటర్, శిక్షణ కేంద్రంపై మంగళవారం బాంబుల వర్షం కురిపించి ధ్వంసం చేసింది. ఐఎస్ స్థావరాలపై 24 గంటల్లో ఇది రెండో వైమానిక దాడి అని ఫ్రాన్స్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అమెరికా సేనలతో కలిసి జరిపిన ఈ దాడిలో 10 రాఫెల్, మిరేజ్-2000 యుద్ధ విమానాలతో 16 బాంబులు వేసినట్లు పేర్కొన్నది. కాగా దాడుల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న యుద్ధ విమానాలకు తోడు చార్లెస్ డి గాలే యుద్ధనౌకను కూడా చేర్చాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









