ఫిషర్మెన్ని సన్మానించిన రాయల్ ఒమన్ పోలీస్
- December 21, 2017
మస్కట్: తగలబడిపోతున్న బోటు నుంచి తొమ్మిది మందిని రక్షించిన ఘటనలో 'హీరో'గా అందరి ప్రశంసలు అందుకున్నఫిషర్మెన్ని రాయల్ ఒమన్ పోలీసులు సన్మానించారు. ఆ హీరో పేరు జస్సెమ్ అల్ బథారి. అల్ షువైమియా ప్రాంతంలోని సముద్ర తీరంలో తొమ్మిది మంది పడవ ప్రమాదంలో ఇరుక్కోగా వారిని ఆయన రక్షించాడు. అగ్ని ప్రమాదాన్ని గుర్తించగానే, తాను అటువైపుగా వెళ్ళాననీ, ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అందులోనివారు సముద్రంలో దూకారనీ, అందులో కొందరికి ఈత రాదనీ, అతి కష్టమ్మీద అందర్నీ రక్షించి తన బోటులోకి చేర్చానని జస్సెమ్ చెప్పారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్అ ంబులెన్స్కి అలాగే రాయల్ ఒమన్ పోలీసులకి, తన స్నేహితుడొకరికి ఘటనపై సమాచారం ఇచ్చినట్లు జస్సెమ్ వివరించారు. అక్టోబర్ 1న ఈ ఘటన జరిగింది. దోఫార్ పోలీస్ కమాండ్ అసిస్టెంట్ కమాండర్ కల్నల్ అలీ బసాదిక్ సమక్షంలో జస్సెమ్ అల్ బథారికి సన్మానం జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







