ఫిషర్మెన్ని సన్మానించిన రాయల్ ఒమన్ పోలీస్
- December 21, 2017
మస్కట్: తగలబడిపోతున్న బోటు నుంచి తొమ్మిది మందిని రక్షించిన ఘటనలో 'హీరో'గా అందరి ప్రశంసలు అందుకున్నఫిషర్మెన్ని రాయల్ ఒమన్ పోలీసులు సన్మానించారు. ఆ హీరో పేరు జస్సెమ్ అల్ బథారి. అల్ షువైమియా ప్రాంతంలోని సముద్ర తీరంలో తొమ్మిది మంది పడవ ప్రమాదంలో ఇరుక్కోగా వారిని ఆయన రక్షించాడు. అగ్ని ప్రమాదాన్ని గుర్తించగానే, తాను అటువైపుగా వెళ్ళాననీ, ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అందులోనివారు సముద్రంలో దూకారనీ, అందులో కొందరికి ఈత రాదనీ, అతి కష్టమ్మీద అందర్నీ రక్షించి తన బోటులోకి చేర్చానని జస్సెమ్ చెప్పారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్అ ంబులెన్స్కి అలాగే రాయల్ ఒమన్ పోలీసులకి, తన స్నేహితుడొకరికి ఘటనపై సమాచారం ఇచ్చినట్లు జస్సెమ్ వివరించారు. అక్టోబర్ 1న ఈ ఘటన జరిగింది. దోఫార్ పోలీస్ కమాండ్ అసిస్టెంట్ కమాండర్ కల్నల్ అలీ బసాదిక్ సమక్షంలో జస్సెమ్ అల్ బథారికి సన్మానం జరిగింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







