ఫిషర్మెన్ని సన్మానించిన రాయల్ ఒమన్ పోలీస్
- December 21, 2017
మస్కట్: తగలబడిపోతున్న బోటు నుంచి తొమ్మిది మందిని రక్షించిన ఘటనలో 'హీరో'గా అందరి ప్రశంసలు అందుకున్నఫిషర్మెన్ని రాయల్ ఒమన్ పోలీసులు సన్మానించారు. ఆ హీరో పేరు జస్సెమ్ అల్ బథారి. అల్ షువైమియా ప్రాంతంలోని సముద్ర తీరంలో తొమ్మిది మంది పడవ ప్రమాదంలో ఇరుక్కోగా వారిని ఆయన రక్షించాడు. అగ్ని ప్రమాదాన్ని గుర్తించగానే, తాను అటువైపుగా వెళ్ళాననీ, ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అందులోనివారు సముద్రంలో దూకారనీ, అందులో కొందరికి ఈత రాదనీ, అతి కష్టమ్మీద అందర్నీ రక్షించి తన బోటులోకి చేర్చానని జస్సెమ్ చెప్పారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్అ ంబులెన్స్కి అలాగే రాయల్ ఒమన్ పోలీసులకి, తన స్నేహితుడొకరికి ఘటనపై సమాచారం ఇచ్చినట్లు జస్సెమ్ వివరించారు. అక్టోబర్ 1న ఈ ఘటన జరిగింది. దోఫార్ పోలీస్ కమాండ్ అసిస్టెంట్ కమాండర్ కల్నల్ అలీ బసాదిక్ సమక్షంలో జస్సెమ్ అల్ బథారికి సన్మానం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







