విధి నిర్వహణలో 45 ఏళ్ళ ఫైర్ ఫైటర్ మృతి
- December 21, 2017
యూఏఈ: రస్ అల్ ఖైమాకి చెందిన 45 ఏళ్ళ ఫైర్ ఫైటర్, విధి నిర్వహణలో తీవ్ర గాయాల పాలై, ప్రాణాలు కోల్పోయారు. నాన్ కమిషనల్ ఆఫీసర్ అహ్మద్ అబ్దుల్లా ఇబ్రహీమ్ అల్ మలికి, అల్ ఘాయిల్ ఏరియాలోని సివిల్ డిఫెన్స్ సెంటర్లో డ్యూటీ చేస్తుండగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పెద్ద ఐరన్ గేట్ని తెరిచేందుకు అహ్మద్ అబ్దుల్లా ప్రయత్నించగా, అది ఆయన మీద పడ్డంతో ప్రమాదం చోటు చేసుకుంది. అంబులెన్స్, పారామెడిక్స్ ఘటనా స్థలానికి చేరుకుని, ప్రాథమిక చికిత్సనందించి ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్య చికిత్స అందించిన కాస్సేపటికే ప్రాణాలు కోల్పోయారు అహ్మద్ అబ్దుల్లా. తన సోదరుడ్ని కోల్పోవడం చాలా బాధగా ఉందని అబ్దుల్లా సోదరుడు చెప్పారు. రస్ అల్ ఖైమా సిటీ, మామురా ఏరియాలోని దివాన్ మాస్క్లో అబ్దుల్లా ఫ్యునరల్ ప్రార్థనలు జరుగుతాయి. ఆ తర్వాత హుదైబా సిమిటెరీలో అబ్దుల్లా పార్తీవదేహాన్ని ఖననం చేస్తారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







