విధి నిర్వహణలో 45 ఏళ్ళ ఫైర్ ఫైటర్ మృతి
- December 21, 2017
యూఏఈ: రస్ అల్ ఖైమాకి చెందిన 45 ఏళ్ళ ఫైర్ ఫైటర్, విధి నిర్వహణలో తీవ్ర గాయాల పాలై, ప్రాణాలు కోల్పోయారు. నాన్ కమిషనల్ ఆఫీసర్ అహ్మద్ అబ్దుల్లా ఇబ్రహీమ్ అల్ మలికి, అల్ ఘాయిల్ ఏరియాలోని సివిల్ డిఫెన్స్ సెంటర్లో డ్యూటీ చేస్తుండగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పెద్ద ఐరన్ గేట్ని తెరిచేందుకు అహ్మద్ అబ్దుల్లా ప్రయత్నించగా, అది ఆయన మీద పడ్డంతో ప్రమాదం చోటు చేసుకుంది. అంబులెన్స్, పారామెడిక్స్ ఘటనా స్థలానికి చేరుకుని, ప్రాథమిక చికిత్సనందించి ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్య చికిత్స అందించిన కాస్సేపటికే ప్రాణాలు కోల్పోయారు అహ్మద్ అబ్దుల్లా. తన సోదరుడ్ని కోల్పోవడం చాలా బాధగా ఉందని అబ్దుల్లా సోదరుడు చెప్పారు. రస్ అల్ ఖైమా సిటీ, మామురా ఏరియాలోని దివాన్ మాస్క్లో అబ్దుల్లా ఫ్యునరల్ ప్రార్థనలు జరుగుతాయి. ఆ తర్వాత హుదైబా సిమిటెరీలో అబ్దుల్లా పార్తీవదేహాన్ని ఖననం చేస్తారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







