యెమెన్లో సంకీర్ణ సేనల వైమానిక దాడులు, సుమారు 50 మంది మృతి
- December 26, 2017
యెమెన్లో హౌతీ రెబల్స్పై సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో కనీసం 48 మంది మరణించినట్లు అల్జజీరా టీవీ ఛానల్ తన వార్తా కథనంలో వెల్లడించింది. ఆదివారం నాడు జరిగిన 51 వైమానిక దాడుల్లో కనీసం 11 మంది చిన్నారులతో సహా మొత్తం 48 మంది పౌరులు మృతి చెందినట్లు హౌతీల ఆధ్వర్యంలోని సబా వార్తా సంస్థ వెల్లడించింది. సోమవారం నాడు సనా నగరంలో జరిగిన దాడుల్లో ముగ్గురు చిన్నారులతో సహా మరో 11 మంది మరణించారని తెలిపింది. ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డారని వివరించింది. సనా నగరం పశ్చిమ ప్రాంతంలో నివశిస్తున్న హౌతీ స్థానిక నేత మహ్మద్ అల్ రైమీ నివాసం లక్ష్యంగా సంకీర్ణ సేనలు ఈ దాడులు చేశాయని హౌతీ దళాలకు చెందిన అబ్దుల్ మాలిక్ అల్ ఫాదిల్ అనే కార్యకర్త వివరించాడు. సౌదీ అరేబియా యుద్ధ విమానాలు హౌతీల ఆధ్వర్యంలోని ఒక ప్రభుత్వ భవనంపై కూడా దాడులు చేశాయని మరో అధికారి వివరించారు. ఈ నెలలో ఇప్పటి వరకూ సంకీర్ణ సేనలు నిర్వహించిన వైమానిక దాడుల్లో కనీసం 136 మంది పౌరులు మరణించారని ఐరాస మానవ హక్కుల కమిటీ ప్రతినిధి రూపర్ట్ కోల్విల్లీ వివరించారు. యెమెన్లో ప్రభుత్వ సేనలకు, హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య 2014 నుండి అంతర్యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







