యెమెన్లో సంకీర్ణ సేనల వైమానిక దాడులు, సుమారు 50 మంది మృతి
- December 26, 2017
యెమెన్లో హౌతీ రెబల్స్పై సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో కనీసం 48 మంది మరణించినట్లు అల్జజీరా టీవీ ఛానల్ తన వార్తా కథనంలో వెల్లడించింది. ఆదివారం నాడు జరిగిన 51 వైమానిక దాడుల్లో కనీసం 11 మంది చిన్నారులతో సహా మొత్తం 48 మంది పౌరులు మృతి చెందినట్లు హౌతీల ఆధ్వర్యంలోని సబా వార్తా సంస్థ వెల్లడించింది. సోమవారం నాడు సనా నగరంలో జరిగిన దాడుల్లో ముగ్గురు చిన్నారులతో సహా మరో 11 మంది మరణించారని తెలిపింది. ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డారని వివరించింది. సనా నగరం పశ్చిమ ప్రాంతంలో నివశిస్తున్న హౌతీ స్థానిక నేత మహ్మద్ అల్ రైమీ నివాసం లక్ష్యంగా సంకీర్ణ సేనలు ఈ దాడులు చేశాయని హౌతీ దళాలకు చెందిన అబ్దుల్ మాలిక్ అల్ ఫాదిల్ అనే కార్యకర్త వివరించాడు. సౌదీ అరేబియా యుద్ధ విమానాలు హౌతీల ఆధ్వర్యంలోని ఒక ప్రభుత్వ భవనంపై కూడా దాడులు చేశాయని మరో అధికారి వివరించారు. ఈ నెలలో ఇప్పటి వరకూ సంకీర్ణ సేనలు నిర్వహించిన వైమానిక దాడుల్లో కనీసం 136 మంది పౌరులు మరణించారని ఐరాస మానవ హక్కుల కమిటీ ప్రతినిధి రూపర్ట్ కోల్విల్లీ వివరించారు. యెమెన్లో ప్రభుత్వ సేనలకు, హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య 2014 నుండి అంతర్యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









