రజని 'ముత్తు' ఆధారంగా బాలయ్య 'జై సింహా'

- December 26, 2017 , by Maagulf
రజని 'ముత్తు' ఆధారంగా బాలయ్య 'జై సింహా'

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం 'జై సింహా'. కే.ఎస్‌ రవికుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని 1995లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం 'ముత్తు' ఆధారంగా తెరకెక్కించారట. ఈ విషయాన్ని 'ముత్తు' చిత్ర రచయిత రత్నం వెల్లడించారు. అప్పట్లో'ముత్తు' చిత్రం జపనీస్‌ వెర్షన్‌లోనూ విడుదలై రికార్డులు సృష్టించింది. అదేవిధంగా 'జై సింహా' చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంటుందని రత్నం తెలిపారు. సినిమా సెకెండ్‌ హాఫ్‌ మొత్తం సెంటిమెంట్‌తో కూడిన సన్నివేశాలు ఉంటాయని ప్రేక్షకుడి చేత కన్నీరుపెట్టిస్తాయని పేర్కొన్నారు. ఇందులో బాలయ్యకు జోడీగా నయనతార, నటాషా దోషి, హరిప్రియలు నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, అశుతోష్‌ రానా, బ్రహ్మానందం, మురళీ మోహన్‌, జయప్రకాశ్‌ రెడ్డి సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. సీ.కే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందించారు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com