రజని 'ముత్తు' ఆధారంగా బాలయ్య 'జై సింహా'
- December 26, 2017
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం 'జై సింహా'. కే.ఎస్ రవికుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని 1995లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'ముత్తు' ఆధారంగా తెరకెక్కించారట. ఈ విషయాన్ని 'ముత్తు' చిత్ర రచయిత రత్నం వెల్లడించారు. అప్పట్లో'ముత్తు' చిత్రం జపనీస్ వెర్షన్లోనూ విడుదలై రికార్డులు సృష్టించింది. అదేవిధంగా 'జై సింహా' చిత్రం బ్లాక్బస్టర్ హిట్ అందుకుంటుందని రత్నం తెలిపారు. సినిమా సెకెండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్తో కూడిన సన్నివేశాలు ఉంటాయని ప్రేక్షకుడి చేత కన్నీరుపెట్టిస్తాయని పేర్కొన్నారు. ఇందులో బాలయ్యకు జోడీగా నయనతార, నటాషా దోషి, హరిప్రియలు నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, అశుతోష్ రానా, బ్రహ్మానందం, మురళీ మోహన్, జయప్రకాశ్ రెడ్డి సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. సీ.కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని కల్యాణ్ నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందించారు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









