టెక్కీ మృతదేహాన్ని తెప్పించండి: సుష్మాకు కెటిఆర్ విజ్ఞప్తి
- December 28, 2017
హైదరాబాద్: టెక్కీ కోన ఆదినారాయణ రెడ్డి మృతదేహాన్ని భారత్కు తెప్పించాలని తెలంగాణ ఎన్నారై వ్యవహారాల మంత్రి కెటి రామారావు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను కోరారు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మరణించిన విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్లో పనిచేయడానికి హైదరాబాద్ వచ్చిన కోన ఆదినారాయణ రెడ్డి ఆర నెలల క్రితం ఆస్ట్రేలియా వెళ్లాడు.
మృతదేహాన్ని తెప్పించడానికి సహాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సిడ్నీలోని భారత కాన్సుల్ జనరల్కు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, ఓవర్సీస్ ఇండియన్స్కు లేఖలు రాసింది.
ఇటీవల ఆదినారాయణ రెడ్డి సిడ్నీలోని తన గదిలో మరణించాడు. అతని మరణానికి ఇప్పటి వరకు కచ్చితమైన కారణం తెలియలేదు. అతను మరణించిన రెండు రోజుల తర్వాత తమకు తెలిసిందని ఆయన బంధువులు అంటున్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









