టెక్కీ మృతదేహాన్ని తెప్పించండి: సుష్మాకు కెటిఆర్ విజ్ఞప్తి
- December 28, 2017
హైదరాబాద్: టెక్కీ కోన ఆదినారాయణ రెడ్డి మృతదేహాన్ని భారత్కు తెప్పించాలని తెలంగాణ ఎన్నారై వ్యవహారాల మంత్రి కెటి రామారావు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను కోరారు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మరణించిన విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్లో పనిచేయడానికి హైదరాబాద్ వచ్చిన కోన ఆదినారాయణ రెడ్డి ఆర నెలల క్రితం ఆస్ట్రేలియా వెళ్లాడు.
మృతదేహాన్ని తెప్పించడానికి సహాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సిడ్నీలోని భారత కాన్సుల్ జనరల్కు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, ఓవర్సీస్ ఇండియన్స్కు లేఖలు రాసింది.
ఇటీవల ఆదినారాయణ రెడ్డి సిడ్నీలోని తన గదిలో మరణించాడు. అతని మరణానికి ఇప్పటి వరకు కచ్చితమైన కారణం తెలియలేదు. అతను మరణించిన రెండు రోజుల తర్వాత తమకు తెలిసిందని ఆయన బంధువులు అంటున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







