జాత్యహంకార వ్యాఖ్యలు: ఇద్దరు జర్నలిస్ట్ల అరెస్ట్కి రంగం సిద్ధం
- December 28, 2017
అబుదాబీ: పబ్లిక్ ప్రాసిక్యూషన్, ఇద్దరు జర్నలిస్ట్లను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మీడియా సంస్థల్లో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో వీరు చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు, చట్ట వ్యతిరేకమని న్యాయస్థానం నిర్ధారించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రిమినల్ చర్యలకు వేదికగా ఉపయోగించుకోవడంపైనా న్యాయస్థానం జర్నలిస్టుల తీరుని తప్పు పట్టింది. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్, ప్రజలెవరూ సోషల్ మీడియాని తప్పుడు చర్యల కోసం వినియోగించరాదని విజ్ఞప్తి చేయడం జరిగింది. సొసైటీకి, పబ్లిక్ ఆర్డర్కీ చేటు కలిగించే ఎలాంటి రాతలు, బొమ్మలు, ఫొటోలు, వీడియోలు, అయినా చట్ట వ్యతిరేకమేనని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వినియోగంపై ఎప్పటికప్పుడు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు దాన్ని దుర్వినియోగం చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









