జాత్యహంకార వ్యాఖ్యలు: ఇద్దరు జర్నలిస్ట్ల అరెస్ట్కి రంగం సిద్ధం
- December 28, 2017
అబుదాబీ: పబ్లిక్ ప్రాసిక్యూషన్, ఇద్దరు జర్నలిస్ట్లను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మీడియా సంస్థల్లో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో వీరు చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు, చట్ట వ్యతిరేకమని న్యాయస్థానం నిర్ధారించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రిమినల్ చర్యలకు వేదికగా ఉపయోగించుకోవడంపైనా న్యాయస్థానం జర్నలిస్టుల తీరుని తప్పు పట్టింది. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్, ప్రజలెవరూ సోషల్ మీడియాని తప్పుడు చర్యల కోసం వినియోగించరాదని విజ్ఞప్తి చేయడం జరిగింది. సొసైటీకి, పబ్లిక్ ఆర్డర్కీ చేటు కలిగించే ఎలాంటి రాతలు, బొమ్మలు, ఫొటోలు, వీడియోలు, అయినా చట్ట వ్యతిరేకమేనని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వినియోగంపై ఎప్పటికప్పుడు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు దాన్ని దుర్వినియోగం చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







