విదేశాల్లో కచ్చితంగా '‘కొలువు’
- November 19, 2015
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. ఓ నర్సు వద్ద నుంచి ఓ వ్యక్తి రూ.8లక్షలు కాజేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. థానే నగరానికి చెందిన ఓ యువతి స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె ఫోన్కి గత ఏడాది ఓ కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశం అంటూ మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్కి యువతి ఫోన్ చేయగా.. రూ.8లక్షలు కడితే డెన్మార్క్లో ఉద్యోగం ఇప్పాస్తానంటూ రజినీకాంత్ దోషి అలియాస్ ధర్మేష్ దోషి అనే వ్యక్తి ఆ యువతికి చెప్పాడు.అతని మాటలను నమ్మిన ఆ యువతి ముందుగా అతనికి రూ.4లక్షలు కట్టింది. అయినా ఉద్యోగం రాకపోవడంతో యువతి ఆ వ్యక్తిని నిలదీయగా.. మరో రూ.4లక్షలు కడితే కచ్చితంగా ఉద్యోగం అంటూ నమ్మించాడు. అయినా ఉద్యోగం రాకపోవడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తిపై గతంలోనూ ఇలాంటి కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









