విదేశాల్లో కచ్చితంగా '‘కొలువు’

- November 19, 2015 , by Maagulf
విదేశాల్లో కచ్చితంగా '‘కొలువు’

విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. ఓ నర్సు వద్ద నుంచి ఓ వ్యక్తి రూ.8లక్షలు కాజేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. థానే నగరానికి చెందిన ఓ యువతి స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె ఫోన్‌కి గత ఏడాది ఓ కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశం అంటూ మెసేజ్‌ వచ్చింది. అందులో ఉన్న ఫోన్‌ నెంబర్‌కి యువతి ఫోన్‌ చేయగా.. రూ.8లక్షలు కడితే డెన్మార్క్‌లో ఉద్యోగం ఇప్పాస్తానంటూ రజినీకాంత్‌ దోషి అలియాస్‌ ధర్మేష్‌ దోషి అనే వ్యక్తి ఆ యువతికి చెప్పాడు.అతని మాటలను నమ్మిన ఆ యువతి ముందుగా అతనికి రూ.4లక్షలు కట్టింది. అయినా ఉద్యోగం రాకపోవడంతో యువతి ఆ వ్యక్తిని నిలదీయగా.. మరో రూ.4లక్షలు కడితే కచ్చితంగా ఉద్యోగం అంటూ నమ్మించాడు. అయినా ఉద్యోగం రాకపోవడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తిపై గతంలోనూ ఇలాంటి కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com