హలీమ్ కబాబ్
- December 30, 2017
కావలసిన పదార్థాలు:
గోధుమ రవ్వ - అర కప్పు
మినప్పప్పు - అర కప్పు
కందిపప్పు - అర కప్పు
పెసర పప్పు - అర కప్పు
మటన్ చాప్స్ - కిలో
తరిగిన వెల్లుల్లి - 10
అల్లం తరుగు - 2 టీస్పూన్లు
నెయ్యి - 2 టే.స్పూన్లు
ధనియాల పొడి - 1 టే.స్పూను
జీలకర్ర పొడి - 1 టే.స్పూను
చాట్ మసాలా - 1 టే.స్పూను
కారం - 1 టే.స్పూను
కుంకుమ పువ్వు - పావు టీస్పూను
పసుపు - 1 టే.స్పూను
కొత్తిమీర తరుగు - 1 కప్పు
పుదీనా తరుగు - 1 కప్పు
పచ్చిమిర్చి - 4
శనగపప్పు - 1 కప్పు
తయారీ విధానం:
శనగపప్పు తప్ప అన్ని పప్పులు శుభ్రంగా కడిగి రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి.
ఉదయం మళ్లీ కడిగి వెడల్పాటి గిన్నెలో వేసుకుని దాన్లో మటన్ చాప్స్, వెల్లుల్లి, అల్లం, ఒకటిన్నర లీటర్ల నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించాలి.
నీరు తెర్లాక మంట తగ్గించి మటన్ మెత్తగా తయారయ్యేవరకూ ఉడికించాలి.
తర్వాత గరిటెతో మటన్ చాప్స్ వేరే ప్లేట్లోకి తీసి చల్లారాక ఎముకలు తీసేయాలి.
శనగపప్పుని నూనె లేకుండా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
ఈ మాంసాన్ని మెత్తగా మెదిపి శనగపప్పుతో కలిపి పక్కనుంచాలి.
బాండీలో నూనె పోసి గరం మసాలా దినుసులు, కుంకుమ పువ్వు వేసి సువాసన వచ్చేదాకా వేయించాలి.
తర్వాత దీనికి ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని, మటన్ను చేర్చి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి.
10 నిమిషాలకు మిశ్రమం చిక్కబడిన తర్వాత మెత్తని పేస్ట్లా మెదిపి చేతికి నూనె రాసుకుని 50 గ్రాముల ఉండలుగా చుట్టాలి.
ఈ ఉండలను చదునుగా చేసి పెనం మీద రెండు వైపులా కాల్చుకుని వేడిగా సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







