దుబాయ్ లో అష్టకష్టాలు పడ్తున్న తెలంగాణ వాసి
- December 30, 2017
దుబాయ్లో ఉద్యోగానికి వెళ్లి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక రోడ్లపై ఉండాల్సిన పరిస్థితి. అప్పుచేసి బతుకుదెరువుకోసం పొరుగుదేశం వెళ్లి పాట్లుపడుతున్న కరీంనగర్ అభాగ్యుడు.
కష్టాలను వెళ్లబోసుకుంటూ అభాగ్యుడి పేరు మధు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామవాసి. బతుకుదెరుకోసం లక్షాపదివేలు అప్పు తీసుకొని ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లాడు. అక్కడ స్టార్ సర్ఫింగ్ కంపెనీలో పనికి చేరారు. కానీ వెళ్లిన రెండు నెలలకే మధుకి తత్వం బోధపడింది. తను మోసపోయినట్లు గ్రహించాడు.
ఒప్పందం ప్రకారం జీతం ఇవ్వకుండా కంపెనీ మోసం చేసిందని సెల్ఫీ వీడియోలో బాధితుడు గోడు వెళ్లబోసుకున్నాడు. అంతేకాదు కంపెనీ తరపున ఇన్సూరెన్స్ కూడా లేదని వాపోయాడు. మధు నానాపాట్లు పడుతున్నట్లు తెలిపారు. తనలాగే చాలా మంది అక్కడ కష్టాలు పడుతున్నట్లు చెప్పారు. ఫోన్లో మధు ఆవేదన విన్న అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మధుని ఇండియాకు రప్పించాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







