దుబాయ్ లో అష్టకష్టాలు పడ్తున్న తెలంగాణ వాసి
- December 30, 2017
దుబాయ్లో ఉద్యోగానికి వెళ్లి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక రోడ్లపై ఉండాల్సిన పరిస్థితి. అప్పుచేసి బతుకుదెరువుకోసం పొరుగుదేశం వెళ్లి పాట్లుపడుతున్న కరీంనగర్ అభాగ్యుడు.
కష్టాలను వెళ్లబోసుకుంటూ అభాగ్యుడి పేరు మధు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామవాసి. బతుకుదెరుకోసం లక్షాపదివేలు అప్పు తీసుకొని ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లాడు. అక్కడ స్టార్ సర్ఫింగ్ కంపెనీలో పనికి చేరారు. కానీ వెళ్లిన రెండు నెలలకే మధుకి తత్వం బోధపడింది. తను మోసపోయినట్లు గ్రహించాడు.
ఒప్పందం ప్రకారం జీతం ఇవ్వకుండా కంపెనీ మోసం చేసిందని సెల్ఫీ వీడియోలో బాధితుడు గోడు వెళ్లబోసుకున్నాడు. అంతేకాదు కంపెనీ తరపున ఇన్సూరెన్స్ కూడా లేదని వాపోయాడు. మధు నానాపాట్లు పడుతున్నట్లు తెలిపారు. తనలాగే చాలా మంది అక్కడ కష్టాలు పడుతున్నట్లు చెప్పారు. ఫోన్లో మధు ఆవేదన విన్న అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మధుని ఇండియాకు రప్పించాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా విడుదల
- మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల సేవలు చిరస్మరణీయం: మంత్రి దుర్గేష్









