మానసిక రోగి పోలీసుపై కత్తితో దాడి .. పోలీస్ మృతి
- January 01, 2018
మస్కట్ : ఒమన్ రాజధాని మస్కట్ లో అత్యంత అరుదైన ఒక దాడిలో పోలీస్ శనివారం ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపాడు. విధి నిర్వహణలో ఉన్న పోలీసును కత్తితో పొడిచి ఆ దుండగుడు హతమార్చాడు. ఆ హంతకుడు "మానసికంగా అనారోగ్యం" గా ఉన్నట్లు అభివర్ణించారు .పోలీసుపై దాడిచేసిన వ్యక్తి మస్కట్ షాపింగ్ సెంటర్ వద్ద ఉన్న పోలీసును కత్తితో పొడిచి గాయపరిచాడు. ఆ నిందితుడు మానసికంగా అనారోగ్యంతో ఉన్నాడని సూచించే ఒక పత్రం తమ స్వాధీనంలో ఉందని పోలీసులు తెలిపారు. స్థానిక టీవీ ఛానెల్ తో ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ " నిందితుని అనుమానాస్పద ప్రవర్తన గురించి పిర్యదు తీసుకొన్న పోలీసులు షాపింగ్ సెంటర్ వద్దకు వెళ్లారు. అక్కడ అనుమానితుడు ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ వద్ద ఒక వ్యక్తితో తగాదా పడుతున్నాడు దీనితో అడ్డుకోబోయిన పోలీసును .అనుమానితుడు ఒక కత్తిని వెలుపలకు లాగి ఆ పోలీస్ అధికారిని బలంగా పొడిచాడు. ప్రాణాంతక గాయంతో ఆ పోలీస్ అధికారి విలవిలాడుతుండగా . మరో ఇద్దరు అధికారులను సైతం కత్తితో పొడిచాడని తెలిపారు. ఎట్టకేలకు ఆ దాడిని అడ్డుకొని నిందితుడిని అరెస్టు చేశారు. ఒమన్ లో నేరాల సంఖ్య అతి తక్కువగా నమోదుకావడంతో ఈ కత్తిపోట్ల వ్యవహారం స్థానికంగా సంచలనం కల్గించింది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









