మానసిక రోగి పోలీసుపై కత్తితో దాడి .. పోలీస్ మృతి
- January 01, 2018
మస్కట్ : ఒమన్ రాజధాని మస్కట్ లో అత్యంత అరుదైన ఒక దాడిలో పోలీస్ శనివారం ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపాడు. విధి నిర్వహణలో ఉన్న పోలీసును కత్తితో పొడిచి ఆ దుండగుడు హతమార్చాడు. ఆ హంతకుడు "మానసికంగా అనారోగ్యం" గా ఉన్నట్లు అభివర్ణించారు .పోలీసుపై దాడిచేసిన వ్యక్తి మస్కట్ షాపింగ్ సెంటర్ వద్ద ఉన్న పోలీసును కత్తితో పొడిచి గాయపరిచాడు. ఆ నిందితుడు మానసికంగా అనారోగ్యంతో ఉన్నాడని సూచించే ఒక పత్రం తమ స్వాధీనంలో ఉందని పోలీసులు తెలిపారు. స్థానిక టీవీ ఛానెల్ తో ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ " నిందితుని అనుమానాస్పద ప్రవర్తన గురించి పిర్యదు తీసుకొన్న పోలీసులు షాపింగ్ సెంటర్ వద్దకు వెళ్లారు. అక్కడ అనుమానితుడు ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ వద్ద ఒక వ్యక్తితో తగాదా పడుతున్నాడు దీనితో అడ్డుకోబోయిన పోలీసును .అనుమానితుడు ఒక కత్తిని వెలుపలకు లాగి ఆ పోలీస్ అధికారిని బలంగా పొడిచాడు. ప్రాణాంతక గాయంతో ఆ పోలీస్ అధికారి విలవిలాడుతుండగా . మరో ఇద్దరు అధికారులను సైతం కత్తితో పొడిచాడని తెలిపారు. ఎట్టకేలకు ఆ దాడిని అడ్డుకొని నిందితుడిని అరెస్టు చేశారు. ఒమన్ లో నేరాల సంఖ్య అతి తక్కువగా నమోదుకావడంతో ఈ కత్తిపోట్ల వ్యవహారం స్థానికంగా సంచలనం కల్గించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







