తెరాస పార్టీకి చెందిన నేతలను మావోయిస్టులు కిడ్నాప్...
- November 19, 2015
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లో ఆరుగురు అధికార తెరాస పార్టీకి చెందిన నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. చర్ల మండలం పుసుగుప్ప అటవీ ప్రాంతంలో ఈ నేతలను అపహరించుకుపోయారు. అపహరణకు గురైన వారిలో భద్రాచలం నియోజకవర్గ తెరాస ఇన్ఛార్జి మానే రామకృష్ణ, చర్ల మండల నాయకులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సురేశ్, వాజేడు మండల నాయకుడు జనార్ధన్, సత్యనారాయణ ఉన్నారు. బూటకపు ఎన్కౌంటర్లు నిలిపివేయాలంటూ మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట చర్లలో లేఖ విడుదల చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







