తెరాస పార్టీకి చెందిన నేతలను మావోయిస్టులు కిడ్నాప్...

- November 19, 2015 , by Maagulf
తెరాస పార్టీకి చెందిన నేతలను మావోయిస్టులు కిడ్నాప్...

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లో ఆరుగురు అధికార తెరాస పార్టీకి చెందిన నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. చర్ల మండలం పుసుగుప్ప అటవీ ప్రాంతంలో ఈ నేతలను అపహరించుకుపోయారు. అపహరణకు గురైన వారిలో భద్రాచలం నియోజకవర్గ తెరాస ఇన్‌ఛార్జి మానే రామకృష్ణ, చర్ల మండల నాయకులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సురేశ్‌, వాజేడు మండల నాయకుడు జనార్ధన్‌, సత్యనారాయణ ఉన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లు నిలిపివేయాలంటూ మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ పేరిట చర్లలో లేఖ విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com