4 ఎన్.ఎస్.ఎస్ అవార్డులు దక్కించుకున్న తెలంగాణ రాష్ట్రం
- January 02, 2018
హైదరాబాద్:జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) విభాగంలో కేంద్రం అందించిన అత్యున్నత అవార్డులు అందుకున్న తెలంగాణ వాలంటీర్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం అభినందించారు. 2016-17 సంవత్సరానికి కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అందించిన ఎన్.ఎస్.ఎస్. అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగు దక్కించుకుంది. ఉత్తమ యూనిట్ అవార్డు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ కు చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్ కు, ఉత్తమ ప్రోగ్రామ్ ఆఫీసర్ అవార్డు అనురాగ్ గ్రూప్ ప్రోగ్రాం ఆఫీసర్ సి.మల్లేశ్, ఉత్తమ వాలంటీర్లుగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి చెందిన తగరపు నవీన్, జె.ఎన్.టి.యు(హెచ్)కు చెందిన పటుకూరి లలిత్ ఆదిత్య గత నెలలో అందుకున్నారు. వీరిని సిఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. రాష్ట్ర మాజీ లైజనింగ్ ఆఫీసర్ డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి