4 ఎన్.ఎస్.ఎస్ అవార్డులు దక్కించుకున్న తెలంగాణ రాష్ట్రం
- January 02, 2018
హైదరాబాద్:జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) విభాగంలో కేంద్రం అందించిన అత్యున్నత అవార్డులు అందుకున్న తెలంగాణ వాలంటీర్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం అభినందించారు. 2016-17 సంవత్సరానికి కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అందించిన ఎన్.ఎస్.ఎస్. అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగు దక్కించుకుంది. ఉత్తమ యూనిట్ అవార్డు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ కు చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్ కు, ఉత్తమ ప్రోగ్రామ్ ఆఫీసర్ అవార్డు అనురాగ్ గ్రూప్ ప్రోగ్రాం ఆఫీసర్ సి.మల్లేశ్, ఉత్తమ వాలంటీర్లుగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి చెందిన తగరపు నవీన్, జె.ఎన్.టి.యు(హెచ్)కు చెందిన పటుకూరి లలిత్ ఆదిత్య గత నెలలో అందుకున్నారు. వీరిని సిఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. రాష్ట్ర మాజీ లైజనింగ్ ఆఫీసర్ డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









