పెరూలో ఘోర బస్సు ప్రమాదం.. 48మంది మృతి

- January 02, 2018 , by Maagulf
పెరూలో ఘోర బస్సు ప్రమాదం.. 48మంది మృతి

లిమా: పెరూలో ఘోర బస్సు ప్రమాదం సంభవించి 48 మంది మృత్యువాతపడ్డారు. పెరూ రాజధాని లిమాకు 57 మందితో ప్రయాణిస్తున్న బస్సు.. ట్రక్కుకు ఢీకొట్టి లోయలో పడిపోయింది. బస్సు ఎత్తైన కొండ ప్రాంతం నుంచి కిందకు పడిపోవడంతో 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన పసమాయో ప్రాంతం చాలా ప్రమాదకరమైన కొండ అంచు ఇరుకైన రోడ్డు కావడంతో ఈ హైవేను డెవిల్‌ కర్వ్‌ అని అంటారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించారని అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై పెరూ అధ్యక్షుడు పెడ్రో పాబ్లో విచారం వ్యక్తంచేశారు. పెరూలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. 2016లో రోడ్డు ప్రమాదాల కారణంగా 2600 మంది మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com