జనవరి 5న 'నీతో ఏదో చెప్పాలని ఉంది' సాంగ్
- January 04, 2018
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్...తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయ అక్కర్లేని పేరు. చిత్రం, జయం, నువ్వు-నేను, 'సంతోషం', 'మనసంతా', 'నువ్వు లేక నేను లేను' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన ఆర్.పి.పట్నాయక్. దర్శక నిర్మాతగా మారిన తర్వాత తన సంగీతంతో మ్యూజిక్ ప్రేమికులను అలరించడం తగ్గిపోయింది. అయితే సంగీత ప్రేమికుల కోసం ఆర్.పి ఇప్పుడు 'నీతో ఏదో చెప్పాలని ఉంది' అనే మెలోడీ సాంగ్ను సిద్ధం చేశారు. ఈ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. సంగీతం అందించడమే కాకుండా ట్యూన్కు తగ్గ సాహిత్యం కూడా ఆర్.పియే అందించడం విశేషం. ఈ సాంగ్ను ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. 'బాహుబలి' సినిమాలో 'మమతల తల్లి..' పాటను పాడిన సత్య యామిని పాడగా, సత్య యామిని, అనుదీప్ కలిసి నటించారు. జనవరి 5న ఈ పాటను విడుదల చేస్తున్నారు.
ఈ సాంగ్ సంగీతం ప్రపచంలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఆదిత్య మ్యూజిక్ కాన్ఫిడెంట్గా ఉంది. అలాగే మంచి కాన్సెప్ట్స్తో కూడిన ఓరిజినల్ సాంగ్స్ను, మ్యూజిక్ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడానికి ఆదిత్యమ్యూజిక్ ఎప్పుడూ ముందుంటుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







