మసాల కుల్చా
- January 04, 2018కావలసిన పదార్థాలు: మైదా - 250 గ్రా., ఈస్ట్ - ఒక టీ స్పూను, పాలు - ఒక కప్పు, పచ్చిమిర్చి - 2, పెద్ద ఉల్లిపాయలు - 2, కారం - ఒక టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్ స్పూన్లు, బటర్ - ఒక టేబుల్ స్పూను, ఉల్లిగింజలు (కలొంజి) - ఒక టీ స్పూను, కొత్తిమీర తరుగు - ముప్పావు కప్పు.
తయారుచేసే విధానం: గోరువెచ్చని పాలల్లో (ఒక వంతు పాలు + మూడు వంతులు నీరు) ఈస్ట్, అర టీ స్పూను పంచదార వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మైదాలో వేస్తూ ముద్దగా చేసుకుని 30 నిమిషాలు పక్కనుంచాలి. ఉల్లి తరుగులో ఉప్పు, కారం వేసి కొద్దిసేపు తర్వాత పిండి నీరు తీసెయ్యాలి. మైదా ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒత్తి మధ్యలో ఉల్లి మిశ్రమం పెట్టి మడిచి 10 నిమిషాలు పక్కనుంచాలి. ఇప్పుడు ఓవెన్ను 250 డిగ్రీల దగ్గర పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. నూనె రాసిన బేకింగ్ ట్రేలో ఉండలు ఉంచి, చేత్తో కుల్చాలుగా (కచోరిలా) ఒత్తి పైన ఉల్లిగింజలు, కొత్తిమీర చల్లాలి. తర్వాత 160 డిగ్రీల దగ్గర 8-10 నిమషాల పాటు ఓవెన్లో బేక్ చేసుకోవాలి. కుల్చాలకు మసాల శనగల కూర మంచి కాంబినేషన్.
తాజా వార్తలు
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..