మసాల కుల్చా
- January 04, 2018
కావలసిన పదార్థాలు: మైదా - 250 గ్రా., ఈస్ట్ - ఒక టీ స్పూను, పాలు - ఒక కప్పు, పచ్చిమిర్చి - 2, పెద్ద ఉల్లిపాయలు - 2, కారం - ఒక టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్ స్పూన్లు, బటర్ - ఒక టేబుల్ స్పూను, ఉల్లిగింజలు (కలొంజి) - ఒక టీ స్పూను, కొత్తిమీర తరుగు - ముప్పావు కప్పు.
తయారుచేసే విధానం: గోరువెచ్చని పాలల్లో (ఒక వంతు పాలు + మూడు వంతులు నీరు) ఈస్ట్, అర టీ స్పూను పంచదార వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మైదాలో వేస్తూ ముద్దగా చేసుకుని 30 నిమిషాలు పక్కనుంచాలి. ఉల్లి తరుగులో ఉప్పు, కారం వేసి కొద్దిసేపు తర్వాత పిండి నీరు తీసెయ్యాలి. మైదా ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒత్తి మధ్యలో ఉల్లి మిశ్రమం పెట్టి మడిచి 10 నిమిషాలు పక్కనుంచాలి. ఇప్పుడు ఓవెన్ను 250 డిగ్రీల దగ్గర పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. నూనె రాసిన బేకింగ్ ట్రేలో ఉండలు ఉంచి, చేత్తో కుల్చాలుగా (కచోరిలా) ఒత్తి పైన ఉల్లిగింజలు, కొత్తిమీర చల్లాలి. తర్వాత 160 డిగ్రీల దగ్గర 8-10 నిమషాల పాటు ఓవెన్లో బేక్ చేసుకోవాలి. కుల్చాలకు మసాల శనగల కూర మంచి కాంబినేషన్.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









