మసాల కుల్చా
- January 04, 2018
కావలసిన పదార్థాలు: మైదా - 250 గ్రా., ఈస్ట్ - ఒక టీ స్పూను, పాలు - ఒక కప్పు, పచ్చిమిర్చి - 2, పెద్ద ఉల్లిపాయలు - 2, కారం - ఒక టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్ స్పూన్లు, బటర్ - ఒక టేబుల్ స్పూను, ఉల్లిగింజలు (కలొంజి) - ఒక టీ స్పూను, కొత్తిమీర తరుగు - ముప్పావు కప్పు.
తయారుచేసే విధానం: గోరువెచ్చని పాలల్లో (ఒక వంతు పాలు + మూడు వంతులు నీరు) ఈస్ట్, అర టీ స్పూను పంచదార వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మైదాలో వేస్తూ ముద్దగా చేసుకుని 30 నిమిషాలు పక్కనుంచాలి. ఉల్లి తరుగులో ఉప్పు, కారం వేసి కొద్దిసేపు తర్వాత పిండి నీరు తీసెయ్యాలి. మైదా ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒత్తి మధ్యలో ఉల్లి మిశ్రమం పెట్టి మడిచి 10 నిమిషాలు పక్కనుంచాలి. ఇప్పుడు ఓవెన్ను 250 డిగ్రీల దగ్గర పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. నూనె రాసిన బేకింగ్ ట్రేలో ఉండలు ఉంచి, చేత్తో కుల్చాలుగా (కచోరిలా) ఒత్తి పైన ఉల్లిగింజలు, కొత్తిమీర చల్లాలి. తర్వాత 160 డిగ్రీల దగ్గర 8-10 నిమషాల పాటు ఓవెన్లో బేక్ చేసుకోవాలి. కుల్చాలకు మసాల శనగల కూర మంచి కాంబినేషన్.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







