మూడునెలలు ఇలా చేస్తే మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోవచ్చు..!!
- January 04, 2018
ఊబకాయంతో బాధపడుతున్నవారు, లావు తగ్గాలని కోరుకుంటున్నవారు రాత్రి సమయాల్లో అన్నం మానేయడం చాలా మంచి పద్థతి. రాత్రి సమయాల్లో మనం చేసే పని ఏమీ ఉండదు. పైగా విశ్రాంతి కోసం నిద్రపోతాం. నిద్రించే సమయంలో మన శక్తి ఏ మాత్రం ఖర్చు కాదు. దాంతో నైట్ తిన్న ఫుడ్ ద్వారా వచ్చిన కాలరీలో పొట్టలో అలాగే డిపాజిట్ అవుతాయి. అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాకపోవడంతో క్రొవ్వు మిగిలిపోయి లావయ్యే ప్రమాదం ఉంది.
రాత్రి సమయాల్లో భోజనం చేసి వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి హానికరం. రాత్రి సమయంలో భోజనానికి బదులుగా చపాతిని తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్లేటు నిండుగా భోజనం చేసినా, రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒకటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతి శరీరానికి అధిక శక్తి ఇస్తుందని నిరూపితమైంది. శక్తిని ఇస్తుంది కానీ చపాతీల్లో క్రొవ్వు పదార్థాలు మాత్రం ఉండవు.
గోధుమ పిండిలో విటమిన్ - బి, ఈ, కాపర్ అయోడిన్, జింక్, మాంగనీస్ వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. చపాతీలు చాలా బాగా జీర్ణమవుతాయి. జీర్ణవ్యవస్థపై ఎలాంటి ఒత్తిడిపై పడవు. చపాతీని కూడా ఎక్కువగా తీసుకోకుండా మితంగా తీసుకోవాలి. ఇలా మూడునెలల పాటు చేస్తే మీ శరీరంలో మార్పులు కనిపించి మీకు మీరే కొత్త కనిపిస్తారంటున్నారు వైద్య నిపుణులు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







