మూడునెలలు ఇలా చేస్తే మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోవచ్చు..!!
- January 04, 2018
ఊబకాయంతో బాధపడుతున్నవారు, లావు తగ్గాలని కోరుకుంటున్నవారు రాత్రి సమయాల్లో అన్నం మానేయడం చాలా మంచి పద్థతి. రాత్రి సమయాల్లో మనం చేసే పని ఏమీ ఉండదు. పైగా విశ్రాంతి కోసం నిద్రపోతాం. నిద్రించే సమయంలో మన శక్తి ఏ మాత్రం ఖర్చు కాదు. దాంతో నైట్ తిన్న ఫుడ్ ద్వారా వచ్చిన కాలరీలో పొట్టలో అలాగే డిపాజిట్ అవుతాయి. అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాకపోవడంతో క్రొవ్వు మిగిలిపోయి లావయ్యే ప్రమాదం ఉంది.
రాత్రి సమయాల్లో భోజనం చేసి వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి హానికరం. రాత్రి సమయంలో భోజనానికి బదులుగా చపాతిని తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్లేటు నిండుగా భోజనం చేసినా, రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒకటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతి శరీరానికి అధిక శక్తి ఇస్తుందని నిరూపితమైంది. శక్తిని ఇస్తుంది కానీ చపాతీల్లో క్రొవ్వు పదార్థాలు మాత్రం ఉండవు.
గోధుమ పిండిలో విటమిన్ - బి, ఈ, కాపర్ అయోడిన్, జింక్, మాంగనీస్ వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. చపాతీలు చాలా బాగా జీర్ణమవుతాయి. జీర్ణవ్యవస్థపై ఎలాంటి ఒత్తిడిపై పడవు. చపాతీని కూడా ఎక్కువగా తీసుకోకుండా మితంగా తీసుకోవాలి. ఇలా మూడునెలల పాటు చేస్తే మీ శరీరంలో మార్పులు కనిపించి మీకు మీరే కొత్త కనిపిస్తారంటున్నారు వైద్య నిపుణులు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







