మూడునెలలు ఇలా చేస్తే మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోవచ్చు..!!
- January 04, 2018
ఊబకాయంతో బాధపడుతున్నవారు, లావు తగ్గాలని కోరుకుంటున్నవారు రాత్రి సమయాల్లో అన్నం మానేయడం చాలా మంచి పద్థతి. రాత్రి సమయాల్లో మనం చేసే పని ఏమీ ఉండదు. పైగా విశ్రాంతి కోసం నిద్రపోతాం. నిద్రించే సమయంలో మన శక్తి ఏ మాత్రం ఖర్చు కాదు. దాంతో నైట్ తిన్న ఫుడ్ ద్వారా వచ్చిన కాలరీలో పొట్టలో అలాగే డిపాజిట్ అవుతాయి. అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాకపోవడంతో క్రొవ్వు మిగిలిపోయి లావయ్యే ప్రమాదం ఉంది.
రాత్రి సమయాల్లో భోజనం చేసి వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి హానికరం. రాత్రి సమయంలో భోజనానికి బదులుగా చపాతిని తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్లేటు నిండుగా భోజనం చేసినా, రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒకటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతి శరీరానికి అధిక శక్తి ఇస్తుందని నిరూపితమైంది. శక్తిని ఇస్తుంది కానీ చపాతీల్లో క్రొవ్వు పదార్థాలు మాత్రం ఉండవు.
గోధుమ పిండిలో విటమిన్ - బి, ఈ, కాపర్ అయోడిన్, జింక్, మాంగనీస్ వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. చపాతీలు చాలా బాగా జీర్ణమవుతాయి. జీర్ణవ్యవస్థపై ఎలాంటి ఒత్తిడిపై పడవు. చపాతీని కూడా ఎక్కువగా తీసుకోకుండా మితంగా తీసుకోవాలి. ఇలా మూడునెలల పాటు చేస్తే మీ శరీరంలో మార్పులు కనిపించి మీకు మీరే కొత్త కనిపిస్తారంటున్నారు వైద్య నిపుణులు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









