ఓడలలో ఎంచక్కా ...ఇకపై మక్కా !!
- January 08, 2018
సౌదీఅరేబియా: డబ్బు లేకపోతే దైవ దర్శనం సాధ్యపడదా ? ఖరీదైన విమానాలలో బోలెడు ఖర్చు చేయాల్సిందేనా ?? ఇందుకు ఒక పరిష్కారం లభ్యమైంది. హజ్ యాత్రికులు ఇకపై నానా యాతనలు పడనక్కరలేదు. సముద్ర మార్గంలో ఓడలపై సైతం మక్కా చేరుకోవచ్చని కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ప్రకటించారు. ఈ మేరకు మక్కాలో సౌదీ ప్రభుత్వాధికారులతో చర్చలు జరిపామని నక్వీ తెలిపారు. చర్చలు సఫలమయ్యాయని, ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరిందని ఆయన అన్నారు. సముద్ర మార్గం ద్వారా హజ్ యాత్ర చేయాలంటే కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసుకునేందుకు ఇరు దేశాల అధికారులు సమీక్ష నిర్వహించారని ఆయన తెలిపారు. సముద్ర మార్గం ద్వారా హజ్ యాత్ర పేద ముస్లింలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తక్కువ ఖర్చుతో హజ్ యాత్ర పూర్తి చేయించేందుకే సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరిపామని ఆయన అన్నారు. గతంలోనూ ముంబై నుంచి జెడ్డా వరకు సముద్ర మార్గంలో హజ్ యాత్రికులు మక్కా వెళ్లేవారని నక్వీ తెలిపారు. 1995 నుంచి సముద్ర మార్గంలో హజ్ యాత్రికులను సౌదీ ప్రభుత్వం అనుమతించలేదని ఆయన అన్నారు. అయితే సముద్ర మార్గంలో హజ్ యాత్ర చేసేందుకు మరికొంతకాలం పడుతుందని అధికారలు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







