చిన్నారిపై అత్యాచారం, హత్య: జస్ట్ ఫేక్ న్యూస్
- January 09, 2018
మస్కట్: ఒమన్లో ఓ చిన్నారిని అపహరించిన దుండగులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారనీ, అనంతరం ఆమెని హత్య చేశారనీ, మరో ఇద్దరు చిన్నారులూ కిడ్నాప్ అయ్యారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ వాయిస్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. వైరల్గా మారిన ఈ ఉదంతంపై రాయల్ ఒమన్ పోలీసులు స్పందించారు. ఇదంతా ఫేక్ న్యూస్ మాత్రమేనని తేల్చారు. సోహార్లో ఓ బాలిక కిడ్నాప్కి గురయ్యిందనీ, అనంతరం ఆమెను చంపేశారనే వాయిస్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం తమ దృష్టికి కూడా వచ్చిందనీ, అది ఫేక్ న్యూస్ అని నిర్ధారణ అయ్యిందని పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఫేక్ న్యూస్ని వైరల్గా మార్చుతున్నవారిపై కఠిన చర్యలుంటాయని పోలీసులు వివరించారు. సోషల్ మీడియా ద్వారా వివరాల్ని సేకరించి, దుష్ప్రచారం చేపట్టినవారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







