చిన్నారిపై అత్యాచారం, హత్య: జస్ట్ ఫేక్ న్యూస్
- January 09, 2018
మస్కట్: ఒమన్లో ఓ చిన్నారిని అపహరించిన దుండగులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారనీ, అనంతరం ఆమెని హత్య చేశారనీ, మరో ఇద్దరు చిన్నారులూ కిడ్నాప్ అయ్యారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ వాయిస్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. వైరల్గా మారిన ఈ ఉదంతంపై రాయల్ ఒమన్ పోలీసులు స్పందించారు. ఇదంతా ఫేక్ న్యూస్ మాత్రమేనని తేల్చారు. సోహార్లో ఓ బాలిక కిడ్నాప్కి గురయ్యిందనీ, అనంతరం ఆమెను చంపేశారనే వాయిస్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం తమ దృష్టికి కూడా వచ్చిందనీ, అది ఫేక్ న్యూస్ అని నిర్ధారణ అయ్యిందని పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఫేక్ న్యూస్ని వైరల్గా మార్చుతున్నవారిపై కఠిన చర్యలుంటాయని పోలీసులు వివరించారు. సోషల్ మీడియా ద్వారా వివరాల్ని సేకరించి, దుష్ప్రచారం చేపట్టినవారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







