మళ్ళీ ఇంధన ధరలను పెంచే యోచన లేదు
- January 10, 2018
కువైట్: ఇంధన ధరల పెంపునకు కువైట్ ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయడం లేదని ఒక ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. చమురు మార్కెట్ అభివృద్ధిని పర్యవేక్షిస్తూ, వస్తున్నమార్పులతో అనుగుణంగా ధీటుగా వ్యవహరించడానికి అత్యుత్తమ మార్గాలను వెతికేందుకు ప్రభుత్వ రాయితీ కమిటీ చర్చలు కొనసాగిస్తున్నందున, ఇంధన ధరల పెరుగుదల గురించి ఎక్కడా పేర్కొనలేదని తెలిపింది.. నాలుగు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) లో చేసిన నిర్ణయాలు ఇంధన ధరలను పెంచుతుందని చెపుతున్నాయి, అయితే ఇలాంటి చర్యలు తీసుకోలేదు. యుఎఇ, ఖతార్, ఒమన్ మరియు సౌదీ అరేబియాలలో ధరల పెరుగుదలకు కారణమైన కారణాలపై సంబంధిత చమురు అధికారులు నివేదికలు చేశారు. యూఏఈ మరియు సౌదీ అరేబియాలో విలువ జోడించిన పన్ను (వేట్ ) అమలు చేసిన తర్వాత ఇది జరిగింది. సౌదీ అరేబియాలో 127 శాతం పెరిగి, 2017 నాటి కన్నా 20 శాతం వృద్ధిని సాధించగా అదే యుఎఇలో 3.9-4.2 శాతం పెరిగాయి. ఒమన్ ఇంధన ధరలు 2-7 శాతం, కతర్ లో 2.8-3 శాతం పెరిగాయి. 2016 సెప్టెంబరులో మాత్రమే చివరిసారి కువైట్ ఇంధన ధరలు పెరిగాయి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







