మళ్ళీ ఇంధన ధరలను పెంచే యోచన లేదు
- January 10, 2018
కువైట్: ఇంధన ధరల పెంపునకు కువైట్ ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయడం లేదని ఒక ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. చమురు మార్కెట్ అభివృద్ధిని పర్యవేక్షిస్తూ, వస్తున్నమార్పులతో అనుగుణంగా ధీటుగా వ్యవహరించడానికి అత్యుత్తమ మార్గాలను వెతికేందుకు ప్రభుత్వ రాయితీ కమిటీ చర్చలు కొనసాగిస్తున్నందున, ఇంధన ధరల పెరుగుదల గురించి ఎక్కడా పేర్కొనలేదని తెలిపింది.. నాలుగు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) లో చేసిన నిర్ణయాలు ఇంధన ధరలను పెంచుతుందని చెపుతున్నాయి, అయితే ఇలాంటి చర్యలు తీసుకోలేదు. యుఎఇ, ఖతార్, ఒమన్ మరియు సౌదీ అరేబియాలలో ధరల పెరుగుదలకు కారణమైన కారణాలపై సంబంధిత చమురు అధికారులు నివేదికలు చేశారు. యూఏఈ మరియు సౌదీ అరేబియాలో విలువ జోడించిన పన్ను (వేట్ ) అమలు చేసిన తర్వాత ఇది జరిగింది. సౌదీ అరేబియాలో 127 శాతం పెరిగి, 2017 నాటి కన్నా 20 శాతం వృద్ధిని సాధించగా అదే యుఎఇలో 3.9-4.2 శాతం పెరిగాయి. ఒమన్ ఇంధన ధరలు 2-7 శాతం, కతర్ లో 2.8-3 శాతం పెరిగాయి. 2016 సెప్టెంబరులో మాత్రమే చివరిసారి కువైట్ ఇంధన ధరలు పెరిగాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









