మళ్ళీ ఇంధన ధరలను పెంచే యోచన లేదు
- January 10, 2018
కువైట్: ఇంధన ధరల పెంపునకు కువైట్ ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయడం లేదని ఒక ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. చమురు మార్కెట్ అభివృద్ధిని పర్యవేక్షిస్తూ, వస్తున్నమార్పులతో అనుగుణంగా ధీటుగా వ్యవహరించడానికి అత్యుత్తమ మార్గాలను వెతికేందుకు ప్రభుత్వ రాయితీ కమిటీ చర్చలు కొనసాగిస్తున్నందున, ఇంధన ధరల పెరుగుదల గురించి ఎక్కడా పేర్కొనలేదని తెలిపింది.. నాలుగు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) లో చేసిన నిర్ణయాలు ఇంధన ధరలను పెంచుతుందని చెపుతున్నాయి, అయితే ఇలాంటి చర్యలు తీసుకోలేదు. యుఎఇ, ఖతార్, ఒమన్ మరియు సౌదీ అరేబియాలలో ధరల పెరుగుదలకు కారణమైన కారణాలపై సంబంధిత చమురు అధికారులు నివేదికలు చేశారు. యూఏఈ మరియు సౌదీ అరేబియాలో విలువ జోడించిన పన్ను (వేట్ ) అమలు చేసిన తర్వాత ఇది జరిగింది. సౌదీ అరేబియాలో 127 శాతం పెరిగి, 2017 నాటి కన్నా 20 శాతం వృద్ధిని సాధించగా అదే యుఎఇలో 3.9-4.2 శాతం పెరిగాయి. ఒమన్ ఇంధన ధరలు 2-7 శాతం, కతర్ లో 2.8-3 శాతం పెరిగాయి. 2016 సెప్టెంబరులో మాత్రమే చివరిసారి కువైట్ ఇంధన ధరలు పెరిగాయి.
తాజా వార్తలు
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!
- బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ప్రాఢ్..!!
- ఖతార్ లో QR18 బిలియన్లు దాటిన ఆన్లైన్ సేల్స్..!!
- కువైట్ లో ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..!!
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు









