సిగరెట్లు అమ్మలేదని భారత సంతతి వ్యక్తిని చంపేశారు
- January 10, 2018
లండన్: సిగరెట్లు విక్రయించలేదనే ఆగ్రహంతో మైనర్లు భారత సంతతి దుకాణుదారు హత్య చేశారు. ఈ సంఘటన ఉత్తర లండన్లో జరిగింది. మిల్ హిల్ ఏరియాలో విజయ్ పటేల్ అనే 49 ఏళ్ల వ్యక్తి శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు.
యుకె టీనేజర్ల దాడిలో గాయపడిన విజయ్ పటేల్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను సోమవారంనాడు మరణించాడు. దాడిలో పాల్గొన్నవారిని పట్టుకోవాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు పటేల్ ఆస్పత్రిలో పడకపై ఉన్న మృతదేహం, లైఫ్ సపోర్ట్ మిషన్కు తగిలించి ఉన్న వైనం ఫొటోలను విడుదల చేశారు.
విజయ్ పటేల్కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పటేల్ హత్య కేసులో 16 ఏళ్ల బాలుడు కోర్టుకు హాజరయ్యాడు. ముగ్గురు వ్యక్తులు పటేల్పై దాడి చేశారని, సమాచారం సేకరిస్తున్నామని స్కాట్లాండ్ యార్డ్ ఓ ప్రకటనలో తెలిపింది.
పటేల్ ఛాతీపై వారు పిడిగుద్దులు గుద్దినట్లు తెలుస్తోంది. దానివల్ల అతను వెనక్కి పడిపయాడు. పటేల్ 2006లో తన భార్య విభతో కలిసి లండన్ వచ్చాడు. ఈ దాడి జరిగిన సమయంలో భార్య భారత్లో ఉన్నరు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్







