సిగరెట్లు అమ్మలేదని భారత సంతతి వ్యక్తిని చంపేశారు
- January 10, 2018
లండన్: సిగరెట్లు విక్రయించలేదనే ఆగ్రహంతో మైనర్లు భారత సంతతి దుకాణుదారు హత్య చేశారు. ఈ సంఘటన ఉత్తర లండన్లో జరిగింది. మిల్ హిల్ ఏరియాలో విజయ్ పటేల్ అనే 49 ఏళ్ల వ్యక్తి శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు.
యుకె టీనేజర్ల దాడిలో గాయపడిన విజయ్ పటేల్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను సోమవారంనాడు మరణించాడు. దాడిలో పాల్గొన్నవారిని పట్టుకోవాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు పటేల్ ఆస్పత్రిలో పడకపై ఉన్న మృతదేహం, లైఫ్ సపోర్ట్ మిషన్కు తగిలించి ఉన్న వైనం ఫొటోలను విడుదల చేశారు.
విజయ్ పటేల్కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పటేల్ హత్య కేసులో 16 ఏళ్ల బాలుడు కోర్టుకు హాజరయ్యాడు. ముగ్గురు వ్యక్తులు పటేల్పై దాడి చేశారని, సమాచారం సేకరిస్తున్నామని స్కాట్లాండ్ యార్డ్ ఓ ప్రకటనలో తెలిపింది.
పటేల్ ఛాతీపై వారు పిడిగుద్దులు గుద్దినట్లు తెలుస్తోంది. దానివల్ల అతను వెనక్కి పడిపయాడు. పటేల్ 2006లో తన భార్య విభతో కలిసి లండన్ వచ్చాడు. ఈ దాడి జరిగిన సమయంలో భార్య భారత్లో ఉన్నరు.
తాజా వార్తలు
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్ (తినడం, డ్రెస్ కోడ్ & ఇతర నిబంధనలు)
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!









