సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'సైజ్ జీరో' సినిమా..!!
- November 21, 2015
ఆర్య, అనుష్కలు ప్రధాన పాత్రల్లో పీవీపీ బ్యానర్పై తెరకిక్కిన 'సైజ్ జీరో' చిత్రం సెన్సార్ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు అధికారులు దీనికి 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చారు. 'బాహుబలి', 'రుద్రమదేవి' చిత్రాల హిట్ తరువాత లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో వస్తున్న మరో సినిమా 'సైజ్ జీరో'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం హీరోయిన్ అనుష్క ఏకంగా 20 కిలోల బరువు పెరగడంతోపాటు ముద్దుగా, బొద్దుగా బబ్లీ క్యారెక్టర్లో తెరపై కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. వంపు సొంపులతో నాజూగ్గా కనిపించే అనుష్క ఉబకాయం నేపథ్యంలో సాగే విభిన్నమైన పాత్రను చేయడంతో ప్రతి ఒక్కరిలోనూ చిత్రం పట్ల ఆసక్తి నెలకొంది. 'ఇంజి ఇడుపళగి' అనే పేరుతో తమిళ్లో, 'సైజ్ జీరో' పేరిట తెలుగులో ఈ సినిమాను ఒకేసారి ఈ నెల 27వ తేదీన విడుదల చేస్తున్నారు. నటీ నటులు: అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అడవి శేష్, పోసాని కృష్ణ మురళి, భరత్, బ్రహ్మానందం సంగీతం: ఎంఎం కీరవాణి సినిమాటోగ్రఫీ: నిరవ్షా మాటలు: కిరణ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే: కణిక
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







