బహ్రైన్: క్షమాభిక్ష అవకాశాన్ని కోల్పోయిన 2,000 మంది ప్రవాసీయులు

- November 21, 2015 , by Maagulf
బహ్రైన్: క్షమాభిక్ష అవకాశాన్ని కోల్పోయిన 2,000 మంది ప్రవాసీయులు

 

బహ్రైన్ లో అక్రమంగా   నివసిస్తున్న ప్రవాసీయులను ఏ జరిమానా చెల్లించనవసరం లేకుండా తమ దేశానికీ తరలిపోయే అవకాసం కలిగించే క్షమాభిక్ష అవకాశాన్ని 2,000 మంది ప్రవాసీయులు కోల్పోయారు. జూలై 1 న ప్రారంభమైన ఈ ఆరునెలల క్షమాభిక్ష కాలవ్యవధి ని సుమారు 60,000 ,మంది వినియోగించుకుంటారని  ఒక అంచనా; ఐతే రుణగ్రస్తులవటం వలన ప్రయాణంపై నిషేధం ఉన్నవారికీ, పెండింగ్ కోర్టు కేసులు, చట్టపరమైన పత్రాలు లేనివారు, విజిట్ వీసా వ్యవధి దాటినా ఉండిపోయినవారు, ట్రాన్సిట్ వీసా ద్వారా వచ్చి దేశంలో ఉండిపోయిన వారు ఇంకా ఫోర్జరీ పత్రాలను ఉపయోగించిన విదేశీయులు వంటి కోర్టు కేసులు ఉన్నవారికి ఈ క్షమాభిక్ష వర్తించబడదని అధికారులు తెలిపారు.   బంగ్లాదేశ్ రాయబారి మరియు రిటైర్డ్ మేజర్ జనరల్ కె. ఎం. మోమినుర్ రహ్మాన్, ఐతే ఇటువంటి వారు పరిస్థితుల వల బాధితులని, వారు తెలిసి ఏ తప్పు చేయలేదని  అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com