బహ్రైన్: క్షమాభిక్ష అవకాశాన్ని కోల్పోయిన 2,000 మంది ప్రవాసీయులు
- November 21, 2015
బహ్రైన్ లో అక్రమంగా నివసిస్తున్న ప్రవాసీయులను ఏ జరిమానా చెల్లించనవసరం లేకుండా తమ దేశానికీ తరలిపోయే అవకాసం కలిగించే క్షమాభిక్ష అవకాశాన్ని 2,000 మంది ప్రవాసీయులు కోల్పోయారు. జూలై 1 న ప్రారంభమైన ఈ ఆరునెలల క్షమాభిక్ష కాలవ్యవధి ని సుమారు 60,000 ,మంది వినియోగించుకుంటారని ఒక అంచనా; ఐతే రుణగ్రస్తులవటం వలన ప్రయాణంపై నిషేధం ఉన్నవారికీ, పెండింగ్ కోర్టు కేసులు, చట్టపరమైన పత్రాలు లేనివారు, విజిట్ వీసా వ్యవధి దాటినా ఉండిపోయినవారు, ట్రాన్సిట్ వీసా ద్వారా వచ్చి దేశంలో ఉండిపోయిన వారు ఇంకా ఫోర్జరీ పత్రాలను ఉపయోగించిన విదేశీయులు వంటి కోర్టు కేసులు ఉన్నవారికి ఈ క్షమాభిక్ష వర్తించబడదని అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ రాయబారి మరియు రిటైర్డ్ మేజర్ జనరల్ కె. ఎం. మోమినుర్ రహ్మాన్, ఐతే ఇటువంటి వారు పరిస్థితుల వల బాధితులని, వారు తెలిసి ఏ తప్పు చేయలేదని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







