కజకిస్తాన్:బస్సులో అగ్ని ప్రమాదం.. 52 మంది మృతి
- January 18, 2018
మాస్కో: కజకిస్తాన్లో ఘోర విషాదం జరిగింది. ఓ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 52 మంది మరణించారు. అక్టోబ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 57 ప్రయాణికుల్లో కేవలం 5 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్లంతా ప్రస్తుతం హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే బాధితులంతా పొరుగు దేశం ఉజ్బెకిస్తాన్కు చెందినవారని తెలుస్తోంది. ఏ కారణం చేత బస్సు అగ్ని ప్రమాదానికి గురైందన్న అంశం ఇంకా స్పష్టంగా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









