వాళ్ళిద్దరూ కలిశారు: ఇదొక భావోద్వేగాల కలయిక
- January 20, 2018
దుబాయ్:దుబాయ్లో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న భర్త. దుబాయ్ వెళ్ళేందుకు వీసా దొరక్క ఇండియాలో సతమతమవుతున్న భార్య. తన ఆవేదనను ఆ భార్య, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్కి సోషల్ మీడియా ద్వారా పదే పదే విజ్ఞప్తి చేస్తూ రావడంతో, కేంద్ర మంత్రి స్పందించడం, అత్యవసర వీసా ఆమెకు మంజూరయ్యేలా చేయడం ఇదంతా కలా? నిజమా? అని ఆ మహిళ సహా అంతా అనుకున్నారు. ఎట్టకేలకు ఆ భార్య ఆవేదన ఫలితాన్నిచ్చింది. దుబాయ్ వెళ్ళి ఆసుపత్రిలో ఉన్న తన భర్తను కలిసింది. గరిమా అనే మహిళ దుబాయ్లో చికిత్స పొందుతున్న తనభర్తను ఎట్టకేలకు కలిశారు. ఈ సందర్బంగా ఇరువురి మధ్యా భావోద్వేగాలు చోటుచేసుకున్నాయి. 1500 ట్వీట్స్ చేశాననీ, ఆ ట్వీట్స్పై కేంద్ర మంత్రి స్పందించడం చాలా ఆనందంగా ఉందని, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ దుబాయ్ అందించిన సహకారం మరువలేనిదని గరిమా చెప్పారు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







