వాళ్ళిద్దరూ కలిశారు: ఇదొక భావోద్వేగాల కలయిక
- January 20, 2018
దుబాయ్:దుబాయ్లో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న భర్త. దుబాయ్ వెళ్ళేందుకు వీసా దొరక్క ఇండియాలో సతమతమవుతున్న భార్య. తన ఆవేదనను ఆ భార్య, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్కి సోషల్ మీడియా ద్వారా పదే పదే విజ్ఞప్తి చేస్తూ రావడంతో, కేంద్ర మంత్రి స్పందించడం, అత్యవసర వీసా ఆమెకు మంజూరయ్యేలా చేయడం ఇదంతా కలా? నిజమా? అని ఆ మహిళ సహా అంతా అనుకున్నారు. ఎట్టకేలకు ఆ భార్య ఆవేదన ఫలితాన్నిచ్చింది. దుబాయ్ వెళ్ళి ఆసుపత్రిలో ఉన్న తన భర్తను కలిసింది. గరిమా అనే మహిళ దుబాయ్లో చికిత్స పొందుతున్న తనభర్తను ఎట్టకేలకు కలిశారు. ఈ సందర్బంగా ఇరువురి మధ్యా భావోద్వేగాలు చోటుచేసుకున్నాయి. 1500 ట్వీట్స్ చేశాననీ, ఆ ట్వీట్స్పై కేంద్ర మంత్రి స్పందించడం చాలా ఆనందంగా ఉందని, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ దుబాయ్ అందించిన సహకారం మరువలేనిదని గరిమా చెప్పారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







