వాళ్ళిద్దరూ కలిశారు: ఇదొక భావోద్వేగాల కలయిక
- January 20, 2018
దుబాయ్:దుబాయ్లో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న భర్త. దుబాయ్ వెళ్ళేందుకు వీసా దొరక్క ఇండియాలో సతమతమవుతున్న భార్య. తన ఆవేదనను ఆ భార్య, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్కి సోషల్ మీడియా ద్వారా పదే పదే విజ్ఞప్తి చేస్తూ రావడంతో, కేంద్ర మంత్రి స్పందించడం, అత్యవసర వీసా ఆమెకు మంజూరయ్యేలా చేయడం ఇదంతా కలా? నిజమా? అని ఆ మహిళ సహా అంతా అనుకున్నారు. ఎట్టకేలకు ఆ భార్య ఆవేదన ఫలితాన్నిచ్చింది. దుబాయ్ వెళ్ళి ఆసుపత్రిలో ఉన్న తన భర్తను కలిసింది. గరిమా అనే మహిళ దుబాయ్లో చికిత్స పొందుతున్న తనభర్తను ఎట్టకేలకు కలిశారు. ఈ సందర్బంగా ఇరువురి మధ్యా భావోద్వేగాలు చోటుచేసుకున్నాయి. 1500 ట్వీట్స్ చేశాననీ, ఆ ట్వీట్స్పై కేంద్ర మంత్రి స్పందించడం చాలా ఆనందంగా ఉందని, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ దుబాయ్ అందించిన సహకారం మరువలేనిదని గరిమా చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి