వాళ్ళిద్దరూ కలిశారు: ఇదొక భావోద్వేగాల కలయిక
- January 20, 2018
దుబాయ్:దుబాయ్లో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న భర్త. దుబాయ్ వెళ్ళేందుకు వీసా దొరక్క ఇండియాలో సతమతమవుతున్న భార్య. తన ఆవేదనను ఆ భార్య, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్కి సోషల్ మీడియా ద్వారా పదే పదే విజ్ఞప్తి చేస్తూ రావడంతో, కేంద్ర మంత్రి స్పందించడం, అత్యవసర వీసా ఆమెకు మంజూరయ్యేలా చేయడం ఇదంతా కలా? నిజమా? అని ఆ మహిళ సహా అంతా అనుకున్నారు. ఎట్టకేలకు ఆ భార్య ఆవేదన ఫలితాన్నిచ్చింది. దుబాయ్ వెళ్ళి ఆసుపత్రిలో ఉన్న తన భర్తను కలిసింది. గరిమా అనే మహిళ దుబాయ్లో చికిత్స పొందుతున్న తనభర్తను ఎట్టకేలకు కలిశారు. ఈ సందర్బంగా ఇరువురి మధ్యా భావోద్వేగాలు చోటుచేసుకున్నాయి. 1500 ట్వీట్స్ చేశాననీ, ఆ ట్వీట్స్పై కేంద్ర మంత్రి స్పందించడం చాలా ఆనందంగా ఉందని, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ దుబాయ్ అందించిన సహకారం మరువలేనిదని గరిమా చెప్పారు.
తాజా వార్తలు
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?









