ఏప్రిల్ 27నే 'నా పేరు సూర్య' విడుదల తేదీని ఖరారు చేసేశారు
- January 24, 2018
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య’. వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విడుదలపై వస్తున్న రూమర్లకు నిర్మాతలు చెక్ పెట్టారు. సినిమా విడుదల తేదీని మార్చినట్లు సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు వస్తుండటంతో నిర్మాతలు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. అనుకున్న తేదీ ప్రకారం ఏప్రిల్ 27న విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను అనే సినిమాలో సూపర్స్టార్ మహేష్బాబు నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల కూడా ఏప్రిల్ 27నే ఉండటంతో ఓపెనింగ్స్ దెబ్బతినకూడదని ‘నా పేరు సూర్య‘ను ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. వాటన్నింటికి చిత్ర నిర్మాతలు ఫుల్స్టాప్ పెట్టారు. ముందుగా అనుకున్న ప్రకారమే చిత్రం ఏప్రిల్ 27నాడే విడుదలవుతుందని వెళ్లడించారు. లగడపాటి శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో బన్నీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. విశాల్-శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







