ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్: 187 ఆలౌట్
- January 24, 2018
జొహానెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 187 పరుగులకు ఆలౌటైంది. పట్టుదలగా ఆడిన పేసర్ భువనేశ్వర్ కుమార్ (30; 49 బంతుల్లో 4×4) చివరి వికెట్గా వెనుదిరిగాడు. జట్టుకు అవసరమైన విలువైన పరుగులు సాధించిన అతడిని 76.4వ బంతికి రబాడ పెవిలియన్కు పంపించాడు. ఉన్నంత సేపు సఫారీ బౌలర్ల కూటమి విసిరిన చురకత్తుల్లాంటి బంతులను భువి చక్కగా కాచుకోవడం విశేషం. బుమ్రా (0; 7 బంతుల్లో) నాటౌట్గా నిలిచాడు.
భారత జట్టులో సారథి విరాట్ కోహ్లీ (54), ఛెతేశ్వర్ పుజారా (50) అర్ధశతకాలు సాధించారు. భువిని పక్కనపెడితే మిగతా బ్యాట్స్మెన్ అంతా రెండంకెల స్కోరు సైతం చేయలేదు. భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన అజింక్య రహానె (9) మోర్నీ మోర్కెల్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రబాడ 3, మోర్కెల్, ఫిలాండర్, ఫెహ్లుక్వాయో తలో రెండు వికెట్లు తీశారు. ఎంగిడికి విరాట్ కోహ్లీ వికెట్ దక్కింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







