ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్: 187 ఆలౌట్
- January 24, 2018
జొహానెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 187 పరుగులకు ఆలౌటైంది. పట్టుదలగా ఆడిన పేసర్ భువనేశ్వర్ కుమార్ (30; 49 బంతుల్లో 4×4) చివరి వికెట్గా వెనుదిరిగాడు. జట్టుకు అవసరమైన విలువైన పరుగులు సాధించిన అతడిని 76.4వ బంతికి రబాడ పెవిలియన్కు పంపించాడు. ఉన్నంత సేపు సఫారీ బౌలర్ల కూటమి విసిరిన చురకత్తుల్లాంటి బంతులను భువి చక్కగా కాచుకోవడం విశేషం. బుమ్రా (0; 7 బంతుల్లో) నాటౌట్గా నిలిచాడు.
భారత జట్టులో సారథి విరాట్ కోహ్లీ (54), ఛెతేశ్వర్ పుజారా (50) అర్ధశతకాలు సాధించారు. భువిని పక్కనపెడితే మిగతా బ్యాట్స్మెన్ అంతా రెండంకెల స్కోరు సైతం చేయలేదు. భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన అజింక్య రహానె (9) మోర్నీ మోర్కెల్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రబాడ 3, మోర్కెల్, ఫిలాండర్, ఫెహ్లుక్వాయో తలో రెండు వికెట్లు తీశారు. ఎంగిడికి విరాట్ కోహ్లీ వికెట్ దక్కింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







