దావోస్లో కేటీఆర్ బిజీ!
- January 24, 2018
దావోస్:దావోస్లో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు. రెండో రోజు పలు ప్రముఖ కంపెనీలతో సమావేశమయ్యారు. ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో ఆంటోనీ ఫెర్నాండెజ్తో సమావేశమయ్యారు. అటు నొవార్టిస్ కార్యకలాపాల విస్తరణకు అంగీకారం తెలిపారు. మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కెన్ కవాయి బృందంతో సమావేశమయ్యారు. జపనీస్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ పార్క్ ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, కల్పిస్తున్న వసతులు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం తదితర అంశాలను వివరించారు. అటు కువైట్కు చెందిన ఫవద్ అల్గానిమ్ కంపెనీ సీఈవోతో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ ఇప్పటికే సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ముందు ఉందని అన్నారు. రాష్ట్రంలో పవర్, మెడికల్ డివైజెస్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







