దావోస్లో కేటీఆర్ బిజీ!
- January 24, 2018
దావోస్:దావోస్లో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు. రెండో రోజు పలు ప్రముఖ కంపెనీలతో సమావేశమయ్యారు. ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో ఆంటోనీ ఫెర్నాండెజ్తో సమావేశమయ్యారు. అటు నొవార్టిస్ కార్యకలాపాల విస్తరణకు అంగీకారం తెలిపారు. మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కెన్ కవాయి బృందంతో సమావేశమయ్యారు. జపనీస్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ పార్క్ ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, కల్పిస్తున్న వసతులు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం తదితర అంశాలను వివరించారు. అటు కువైట్కు చెందిన ఫవద్ అల్గానిమ్ కంపెనీ సీఈవోతో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ ఇప్పటికే సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ముందు ఉందని అన్నారు. రాష్ట్రంలో పవర్, మెడికల్ డివైజెస్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









