మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- February 25, 2026
మనామాః పెట్టుబడిదారులను లక్షలాది రూపాయల మోసం చేసినందుకు దోషిగా తేలిన వ్యాపారవేత్తకు 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 100,000 బహ్రెయిన్ దినార్ల జరిమానాను హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది. నేరం ద్వారా వచ్చిన డబ్బును జప్తు చేసి బాధితులకు తిరిగి చెల్లించాలని, ఇద్దరు హక్కుదారులకు తాత్కాలిక పౌర పరిహారం అందించాలని కూడా కోర్టు ఆదేశించింది. 2020 మరియు 2023 మధ్య నిందితుడు రియల్ ఎస్టేట్, కంపెనీల నిర్మాణం, లగ్జరీ కార్లు, గడియారాలు మరియు ప్రత్యేక వాహన నంబర్ ప్లేట్లలో నిపుణుడిగా పరిచయం తీసుకొని ట్రస్ట్ నెట్వర్క్ను నిర్మించాడు. అధిక లాభాలను ఆశచూపి అనేక మంది పెట్టుబడిదారులను మోసం చేశాడు. కోర్టు తీర్పులో మొదటి హక్కుదారునికి 6,000 దినార్లు మరియు రెండవ వ్యక్తికి 1,000 దినార్ల తాత్కాలిక పౌర పరిహారం కూడా ఉంది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









