దుబాయ్ కంపెనీకి టోకరా
- January 24, 2018
తిరువనంతపురం, జనవరి 24: కేరళలో సీపీఎంకు ఊహించని సంకటస్థితి ఎదురైంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడియార్ బాలకృష్ణన్ కుమారుడు వినయ్ వినోదిని బాలకృష్ణన్ ఓ దుబాయ్ కంపెనీని రూ.13 కోట్ల టోపీ పెట్టి పారిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జాస్ టూరిజం-ఎల్ఐసీ అనే సంస్థ నుంచి అప్పు తీసుకున్న వినయ్ ఆ డబ్బు కట్టకుండా యూఏఈ నుంచి పారిపోయాడని, ఆయనపై కేసు నమోదుచేసి తన సొమ్ము ఇప్పించాలని కంపెనీ యజమానుల్లో ఒకరైన ఇస్మాయిల్ అబ్దుల్లా అల్మజూఖీ భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే వినయ్ ఈ ఆరోపణలను తిరస్కరించాడు. తాను తీసుకున్న రుణం మొత్తం చెల్లించేశానని, ఏ మాత్రం బాకీ లేనని వివరించాడు. అయితే ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. నీతులు వల్లించే మార్కిస్టులు ఈ అవినీతి బాగోతంపై ఏమంటారని బీజేపీ, కాంగ్రెస్ ప్రశ్నించాయి.
దీనిపై ఈడీతో దర్యాప్తు చేయించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







