దుబాయ్ కంపెనీకి టోకరా
- January 24, 2018
తిరువనంతపురం, జనవరి 24: కేరళలో సీపీఎంకు ఊహించని సంకటస్థితి ఎదురైంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడియార్ బాలకృష్ణన్ కుమారుడు వినయ్ వినోదిని బాలకృష్ణన్ ఓ దుబాయ్ కంపెనీని రూ.13 కోట్ల టోపీ పెట్టి పారిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జాస్ టూరిజం-ఎల్ఐసీ అనే సంస్థ నుంచి అప్పు తీసుకున్న వినయ్ ఆ డబ్బు కట్టకుండా యూఏఈ నుంచి పారిపోయాడని, ఆయనపై కేసు నమోదుచేసి తన సొమ్ము ఇప్పించాలని కంపెనీ యజమానుల్లో ఒకరైన ఇస్మాయిల్ అబ్దుల్లా అల్మజూఖీ భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే వినయ్ ఈ ఆరోపణలను తిరస్కరించాడు. తాను తీసుకున్న రుణం మొత్తం చెల్లించేశానని, ఏ మాత్రం బాకీ లేనని వివరించాడు. అయితే ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. నీతులు వల్లించే మార్కిస్టులు ఈ అవినీతి బాగోతంపై ఏమంటారని బీజేపీ, కాంగ్రెస్ ప్రశ్నించాయి.
దీనిపై ఈడీతో దర్యాప్తు చేయించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









