దుబాయ్ కంపెనీకి టోకరా
- January 24, 2018
తిరువనంతపురం, జనవరి 24: కేరళలో సీపీఎంకు ఊహించని సంకటస్థితి ఎదురైంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడియార్ బాలకృష్ణన్ కుమారుడు వినయ్ వినోదిని బాలకృష్ణన్ ఓ దుబాయ్ కంపెనీని రూ.13 కోట్ల టోపీ పెట్టి పారిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జాస్ టూరిజం-ఎల్ఐసీ అనే సంస్థ నుంచి అప్పు తీసుకున్న వినయ్ ఆ డబ్బు కట్టకుండా యూఏఈ నుంచి పారిపోయాడని, ఆయనపై కేసు నమోదుచేసి తన సొమ్ము ఇప్పించాలని కంపెనీ యజమానుల్లో ఒకరైన ఇస్మాయిల్ అబ్దుల్లా అల్మజూఖీ భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే వినయ్ ఈ ఆరోపణలను తిరస్కరించాడు. తాను తీసుకున్న రుణం మొత్తం చెల్లించేశానని, ఏ మాత్రం బాకీ లేనని వివరించాడు. అయితే ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. నీతులు వల్లించే మార్కిస్టులు ఈ అవినీతి బాగోతంపై ఏమంటారని బీజేపీ, కాంగ్రెస్ ప్రశ్నించాయి.
దీనిపై ఈడీతో దర్యాప్తు చేయించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







