దుబాయ్‌ కంపెనీకి టోకరా

- January 24, 2018 , by Maagulf
దుబాయ్‌ కంపెనీకి టోకరా

తిరువనంతపురం, జనవరి 24: కేరళలో సీపీఎంకు ఊహించని సంకటస్థితి ఎదురైంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడియార్‌ బాలకృష్ణన్‌ కుమారుడు వినయ్‌ వినోదిని బాలకృష్ణన్‌ ఓ దుబాయ్‌ కంపెనీని రూ.13 కోట్ల టోపీ పెట్టి పారిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జాస్‌ టూరిజం-ఎల్‌ఐసీ అనే సంస్థ నుంచి అప్పు తీసుకున్న వినయ్‌ ఆ డబ్బు కట్టకుండా యూఏఈ నుంచి పారిపోయాడని, ఆయనపై కేసు నమోదుచేసి తన సొమ్ము ఇప్పించాలని కంపెనీ యజమానుల్లో ఒకరైన ఇస్మాయిల్‌ అబ్దుల్లా అల్మజూఖీ భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే వినయ్‌ ఈ ఆరోపణలను తిరస్కరించాడు. తాను తీసుకున్న రుణం మొత్తం చెల్లించేశానని, ఏ మాత్రం బాకీ లేనని వివరించాడు. అయితే ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. నీతులు వల్లించే మార్కిస్టులు ఈ అవినీతి బాగోతంపై ఏమంటారని బీజేపీ, కాంగ్రెస్‌ ప్రశ్నించాయి.

దీనిపై ఈడీతో దర్యాప్తు చేయించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com